మద్యం ప్రియులకు గోవా పర్యాటక శాఖ భారీ ఝలక్ ఇచ్చింది. మద్యం ప్రియులు ఇకపై గోవా బీచ్ లలో మద్యం తాగకూడదని ఆదేశాలు జారీ చేసింది. 2021 కొత్త సంవత్సరం వేడుకల సమయంలో మద్యం ప్రియుల నిర్లక్ష్యం వల్ల గోవా తీర ప్రాంతాలలో భారీ సంఖ్యలో మద్యం సీసాలు చేరాయి. దీంతో గోవా పర్యాటక శాఖ బీచ్ లలో మద్యం తాగే వ్యక్తులకు 2 వేల రూపాయలు, గుంపులుగా మద్యం తాగే వ్యక్తులకు 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని పేర్కొంది.
గతంలోనే గోవా పర్యాటక శాఖ ఈ మేరకు సవరణలు చేసింది. అయితే అప్పట్లో సవరణలు చేసిన చట్టాన్ని ఇప్పుడు అమలు చేయడానికి గోవా పర్యాటక శాఖ సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. బీచ్ లలో మద్యం తాగకూడదని గోవా పర్యాటక శాఖ బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖ కమిషనర్ తమ శాఖకు సిబ్బంది ఉంటే సొంతంగానే ఈ నిబంధనలను అమలు చేస్తామని వెల్లడించారు.
పర్యాటక శాఖ పోలీసుల ద్వారా గోవాలో ఈ చట్టం అమలు కానుందని తెలుస్తోంది. మద్యానికి సంబంధించిన నిబంధనలతో పాటు మరికొన్ని నిబంధనలను కూడా కేంద్రం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గోవా పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం మద్యం ప్రియులకు ఝలక్ అనే చెప్పాలి. సాధారణంగా కొత్త సంవత్సరం వేడుకలను ఎక్కువమంది గోవాలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
సెలబ్రిటీలు సైతం కొత్త సంవత్సరం వేడుకలను గోవాలోనే జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గోవా పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం గురించి మద్యం ప్రియుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.