మద్యం ప్రియులకు గోవా పర్యాటక శాఖ భారీ ఝలక్ ఇచ్చింది. మద్యం ప్రియులు ఇకపై గోవా బీచ్ లలో మద్యం తాగకూడదని ఆదేశాలు జారీ చేసింది. 2021 కొత్త సంవత్సరం వేడుకల సమయంలో మద్యం ప్రియుల నిర్లక్ష్యం వల్ల గోవా తీర ప్రాంతాలలో భారీ సంఖ్యలో మద్యం సీసాలు చేరాయి. దీంతో గోవా పర్యాటక శాఖ బీచ్ లలో మద్యం తాగే వ్యక్తులకు 2 వేల రూపాయలు, గుంపులుగా మద్యం తాగే వ్యక్తులకు 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని పేర్కొంది.
గతంలోనే గోవా పర్యాటక శాఖ ఈ మేరకు సవరణలు చేసింది. అయితే అప్పట్లో సవరణలు చేసిన చట్టాన్ని ఇప్పుడు అమలు చేయడానికి గోవా పర్యాటక శాఖ సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. బీచ్ లలో మద్యం తాగకూడదని గోవా పర్యాటక శాఖ బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖ కమిషనర్ తమ శాఖకు సిబ్బంది ఉంటే సొంతంగానే ఈ నిబంధనలను అమలు చేస్తామని వెల్లడించారు.
పర్యాటక శాఖ పోలీసుల ద్వారా గోవాలో ఈ చట్టం అమలు కానుందని తెలుస్తోంది. మద్యానికి సంబంధించిన నిబంధనలతో పాటు మరికొన్ని నిబంధనలను కూడా కేంద్రం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గోవా పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం మద్యం ప్రియులకు ఝలక్ అనే చెప్పాలి. సాధారణంగా కొత్త సంవత్సరం వేడుకలను ఎక్కువమంది గోవాలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
సెలబ్రిటీలు సైతం కొత్త సంవత్సరం వేడుకలను గోవాలోనే జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గోవా పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం గురించి మద్యం ప్రియుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…