Featured

మద్యం ప్రియులకు ఝలక్.. అక్కడ మందు తాగితే రూ.10,000 జరిమానా..?


మద్యం ప్రియులకు గోవా పర్యాటక శాఖ భారీ ఝలక్ ఇచ్చింది. మద్యం ప్రియులు ఇకపై గోవా బీచ్ లలో మద్యం తాగకూడదని ఆదేశాలు జారీ చేసింది. 2021 కొత్త సంవత్సరం వేడుకల సమయంలో మద్యం ప్రియుల నిర్లక్ష్యం వల్ల గోవా తీర ప్రాంతాలలో భారీ సంఖ్యలో మద్యం సీసాలు చేరాయి. దీంతో గోవా పర్యాటక శాఖ బీచ్ లలో మద్యం తాగే వ్యక్తులకు 2 వేల రూపాయలు, గుంపులుగా మద్యం తాగే వ్యక్తులకు 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని పేర్కొంది.

గతంలోనే గోవా పర్యాటక శాఖ ఈ మేరకు సవరణలు చేసింది. అయితే అప్పట్లో సవరణలు చేసిన చట్టాన్ని ఇప్పుడు అమలు చేయడానికి గోవా పర్యాటక శాఖ సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. బీచ్ లలో మద్యం తాగకూడదని గోవా పర్యాటక శాఖ బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖ కమిషనర్ తమ శాఖకు సిబ్బంది ఉంటే సొంతంగానే ఈ నిబంధనలను అమలు చేస్తామని వెల్లడించారు.

పర్యాటక శాఖ పోలీసుల ద్వారా గోవాలో ఈ చట్టం అమలు కానుందని తెలుస్తోంది. మద్యానికి సంబంధించిన నిబంధనలతో పాటు మరికొన్ని నిబంధనలను కూడా కేంద్రం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గోవా పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం మద్యం ప్రియులకు ఝలక్ అనే చెప్పాలి. సాధారణంగా కొత్త సంవత్సరం వేడుకలను ఎక్కువమంది గోవాలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.

సెలబ్రిటీలు సైతం కొత్త సంవత్సరం వేడుకలను గోవాలోనే జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గోవా పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం గురించి మద్యం ప్రియుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago