సాధారణంగా విమానాశ్రయాలు నగరానికి పదుల సంఖ్యలో కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. నగరం నుంచి విమానాశ్రయానికి చేరుకోవాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.వేలల్లో కాకపోయినా ఆర్.టి.సి బస్సులో ప్రయాణించిన కూడా దాదాపు ఐదారు వందల వరకు ఖర్చు అవుతుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నగరం నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్లాలనుకునేవారు ప్రత్యేక రైళ్ల ద్వారా కేవలం పది రూపాయలు చెల్లించి సరైన సమయానికి విమానాశ్రయం చేరుకొనే అవకాశం కల్పించింది.
బెంగళూరు కమ్యూటేటర్స్ కు రిలీఫ్ ఇచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ స్పెషల్ ట్రైన్ సర్వీస్ స్టార్ట్ చేసింది. బెంగళూరు నుంచి కెంపెగౌడ ఎయిర్పోర్టు వరకూ వెళ్లేందుకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేశారు.సౌత్ వెస్టరన్ రైల్వే దేవనహల్లి స్టేషన్ వరకూ సర్వీస్ మొదలుపెట్టింది. రోడ్ రహిత్, ఫాస్ట్, ఖరీదైన కొత్త సర్వీసును ప్రొవైడ్ చేస్తుంది. సిటీ నుంచి ఎవరైనా సిటీ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లాలంటే ఈ ట్రైన్ ల ద్వారా కేవలం పది రూపాయలకు చెల్లించి వెళ్ళవచ్చు.
ఈ విధంగా విమానాశ్రయాలకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా వెళ్లే వారు చాలామంది ట్రైన్లలో ప్రయాణిస్తే నగరంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా సోమవారం నుంచి ఈ సేవలు ప్రారంభం కావడంతో నగరంలో ఉండే ప్రజలు కెంప గౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు ట్రైన్లలో వెళ్ళవచ్చని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా మరో ఐదారు నెలల్లో ఇదే రూట్ లో మరికొన్ని రైళ్లను కూడా నడిపే ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు తెలియజేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…