తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. 651 ఉద్యోగాల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ లభించింది. సింగరేణి సంస్థ ఎండీ శ్రీధర్ ఈ ఏడాది మార్చి నెలలోపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని అన్నారు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఒకే నోటిఫికేషన్ కాకుండా వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేస్తామని వెల్లడించారు. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
రాతపరీక్ష, ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం. ఈ ఉద్యోగాలతో పాటు సింగరేణి సంస్థలో 1,436 ఇతర ఉద్యోగాల భర్తీ కూడా జరగనుందని తెలుస్తోంది. అతి త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన కూడా వెలువడనుంది. 651 ఉద్యోగాల భర్తీలో 569 కార్మికుల ఉద్యోగాలు, అధికారిక పోస్టులకు సంబంధించిన 82 ఉద్యోగాలను భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఆఫీసర్లు, జూనియర్ ఫారెస్ట్ అధికారులు, మేనేజ్ మెంట్ ట్రెయినీ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని తెలుస్తోంది.
ఈ ఉద్యోగాలు కాకుండా మిగిలిన కార్మికుల ఉద్యోగాలలో మౌల్డర్స్, మిషన్ ట్రెయినీలు, ఎలక్ట్రీషియన్, వెల్డర్ ట్రైనీలు, ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తారని తెలుస్తోంది. 1,436 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్ లు, టెక్నీషియన్లకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తారని సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి సైతం వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.
నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతూ ఉండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ సర్కార్ సైతం ఏకంగా 50,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…