దేశంలో మోసాల సంఖ్య, మోసగాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒక మోసం వెలుగులోకి వచ్చేలోపు మరో కొత్తరకం మోసం వెలుగులోకి వస్తూ ఉండటంతో చాలామంది అమాయకుల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా మరో కొత్తరకం మోసం వెలుగులోకి రావడంతో ఆర్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి హెచ్చరికలు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని కీలక సూచనలు చేసింది.
సైబర్ మోసగాళ్లు మొబైల్ నంబర్ల సహాయంతో ఈ మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వెబ్ సైట్ లో ఆర్బీఐ చేసిన సూచనలను ఎస్బీఐ సైతం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు, ఇతర బ్యాంక్ ఖాతాదారులు సైబర్ మోసాల పట్ల అవగాహన పెంచుకుంటే మంచిది.
సైబర్ మోసగాళ్లు సాధారణంగా బ్యాంకులు కస్టమర్లకు కాల్ చేయడం కోసం వినియోగించే టోల్ ఫ్రీ నంబర్ల సహాయంతో కస్టమర్లకు కాల్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఈ తరహా మోసాలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. యాప్స్ కూడా బ్యాంకుల నుంచే కాల్స్ వచ్చినట్టు చూపిస్తూ ఉండటంతో బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు సైబర్ మోసగాళ్ల చేతిలో సులువుగా మోసపోతున్నారు.
మరి కొందరు మోసగాళ్లు బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్లను పోలి ఉన్న ఫోన్ నంబర్లు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే సులభంగా మోసాలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…