Tag Archives: samanth

Ashu Reddy: మించిపోయి ‘ఊ అంటావా మావా’ అంటూ రెచ్చిపోయిన అషు రెడ్డి.. వీడియో వైరల్!

Ashu Reddy: జూనియర్ సమంతగా పేరు సంపాదించుకొని సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ పొందిన ముద్దుగుమ్మ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్న ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

Ashu Reddy: మించిపోయి ‘ఊ అంటావా మావా’ అంటూ రెచ్చిపోయిన అషు రెడ్డి.. వీడియో వైరల్!

ఈ క్రమంలోనే సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంతో ఫేమస్ అయిన అషు రెడ్డి వివిధ కార్యక్రమాల ద్వారా బిజీగా ఉండడమే కాకుండా ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలను కూడా దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా జూనియర్ సమంత గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా సమంత చేసిన ఐటమ్ సాంగ్ కు స్టెప్పులు వేసింది.

Ashu Reddy: మించిపోయి ‘ఊ అంటావా మావా’ అంటూ రెచ్చిపోయిన అషు రెడ్డి.. వీడియో వైరల్!

పుష్ప సినిమాలో మొట్టమొదటిసారిగా సమంత ‘ఊ అంటావా మావా’ అనే ఐటమ్ సాంగ్ కు చిందులు వేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పాట మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ఈ పాటకు డాన్స్ వేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పాటకు
అషు రెడ్డి కూడా డాన్స్ చేసింది.

సమంతను మించిపోయిన అషు రెడ్డి:

‘ఊ అంటావా మావా’ అనే ఐటమ్ సాంగ్ కు సమంతను మించిన బోల్డ్ అప్పీల్ తో అషుచేసిన ఈ డాన్స్ వీడియో ప్రోమోను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రోమో వీడియో చూసిన అభిమానులు ప్రోమోనే ఇలా ఉంటే ఇక పూర్తి పాట ఏ విధంగా ఉంటుందో అని పూర్తి పాట కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విడాకులపై ప్రశ్నించిన రిపోర్టర్.. ‘నీకు బుద్ధి ఉందా’ అంటూ.. ఫైర్ అయిన సమంత..

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న న్యూస్ చైతూ, సమంత విడాకుల విషయం. వీళ్లిద్దరి మధ్య ఏదో గొడవలు, మనస్పర్థలు జరిగాయని.. వీటిపై ఎన్ని వార్తలు వచ్చినా అందుకే స్పందించడం లేదంటూ వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా నాగచైతన్య లవ్ స్టోరీకి సంబంధించి ట్రైలర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దానికి సమంత రీ ట్వీట్ చేశారు. అదే సందర్భంలో హీరోయిన్ సాయి పల్లవిని, సినిమా టీమ్ సభ్యులను మాత్రమే యాష్ ట్యాగ్ ఇచ్చారు.

అందులో నాగచైతన్యకు యాష్ ట్యాగ్ ఇవ్వకపోవడంతో ఆ అనుమానాలకు బలం చేకూరినట్లు అయింది. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఆ మానసిక వేదన నుంచి బయటపడేందుకే సమంత అనేక మార్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సమంత తిరుమల శ్రీవారిని శనివారం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు.

అంతేకాకుండా ఆమె శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరున్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ దర్శనానికి సమంత ఒక్కరే వచ్చారు.. అక్కినేని కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు. ఇదిలా ఉండగా.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమంత ఘాటుగా సమాధానం ఇచ్చారు.

మీపై వస్తున్న రూమర్స్ గురించి మీ సమాధానం ఏంటని అడగ్గా.. బుద్ది ఉందా నీకు.. పవిత్ర గుడిలో అలాంటి ప్రశ్నలు ఏంటి అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వారిద్దరి మధ్య గొడవలు కారణంగానే ఎన్ని వార్తలు వచ్చినా స్పందించట్లేదని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శాకుంతలం’, తమిళంలో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తోంది సమంత.