Tag Archives: Siddipet

పక్కింటి కుర్రాడిపై మోజు పడి రాత్రి ఇంటికి రమ్మంది.. అది తెలుసుకున్న అత్త బయట గొళ్ళెం పెట్టడంతో.. ఫ్యాన్ కి..

వివాహేతర సంబంధాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. శారీరక సుఖం కోసం ఆశపడి తమపై ఆధారపడిన కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. తమ కుటుంబసభ్యుల కన్నీటికి కారణమవుతున్నారు. ఇంతకు ఇక్కడ జరిగిందేంటంటే.. ఇంట్లో భర్త లేనిది చూసి కట్టుకున్న భార్య పక్కింటి కుర్రాడిని ఇంటికి పిలిచింది. ఇంట్లో అత్తమామలు ఉన్నారనీ కూడా లేకుండా ధైర్యంగా ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

అటుగా వెళ్తున్న అత్త విషయాన్ని గ్రహించి వారు ఉన్న రూంకి గొళ్లెం వేసి తాళం వేసింది. అప్రమత్తమైన ఆ జంట ఎంత బతిమిలాడినా గొళ్లెం తీయలేదు. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన 27 సంవత్సరాల శివ, 25 సంవత్సరాల శీరిషలకు గత కొద్ది సంవత్సరాల క్రితమే వివాహం అయింది. మొదట్లో ఇద్దరు బాగానే ఉన్నా.. తర్వాత భార్య మోజు పక్కింటి కుర్రాడిపై పడింది. అల్లుడు వరుస అయ్యే శ్రీకాంత్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది.

కొంత కాలం తర్వాత వీరి విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో పిలిచి మందలించి పంపించారు. తర్వాత ఓ రోజు శివ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ అవకాశం కోసం ఎదురు చూసిన తన భార్య శ్రీకాంత్ ను ఇంటికి రప్పించింది. ఇంట్లో అందరూ ఉన్నా తన రూంకి రప్పించుకొంది. రూంలోకి వెళ్లిన తర్వాత వాళ్లు లోపల గడియ పెట్టుకున్నారు.

వాళ్ల అత్తయ్య విషయాన్ని గ్రహించి వెంటనే బయట నుంచి గొళ్లెం పెట్టింది. శివ వచ్చే వరకు వాళ్లను అందులోనే ఉంచుదాం అనుకుంది. పరువు పోయిందనే ఉద్దేశ్యంతో లోపల ఉన్న వాళ్లు ఫ్యాన్ కు ఉరేసుకొని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం వెళ్లి గ్రామస్తులు చూసేసరికి విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దారుణం: చనిపోయాడని తెలియక రాత్రంతా మృతదేహంపై నిద్రపోయిన చిన్నారి.. అసలేం జరిగిందంటే!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.తన బాబాయ్ మరణించాడనే విషయం తెలియని ఓ చిన్నారి రాత్రంతా తన బాబాయ్ మృతదేహంపై నిద్రపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన చూసిన పలువురు కంటతడి పెట్టిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ మండలం నర్సన్నపేటకి చెందిన ఎక్కలదేవి ఐలయ్య శనివారం రాత్రి 10 గంటల సమయంలో పని నిమిత్తం జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌లోని తన బావ వద్దకు బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలోనే ఐలయ్య తనతోపాటు తన అన్న కొడుకు మోక్షిత్(4) ని కూడా వెంటబెట్టుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో రోడ్డుపై ధాన్యం కుప్పలు రాశిగా పోసి కప్పి ఉంచారు. చీకట్లో ధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో ఐలయ్య బైక్ అదుపుతప్పి దాన్యం కుప్పను ఢీకొట్టడంతో బండి పైనుంచి చిన్నారి మోక్షిత్ ఐలయ్య ఎగిరి పడ్డారు.

ఈ క్రమంలో రోడ్డు పక్కన పడ్డ ఐలయ్య తలకి తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి మోక్షిత్ కి కూడా గాయాలయ్యాయి. చుట్టూ చీకటిగా ఉండడంతో అటు వైపు ఎవరూ రాలేదు. తన బాబాయి చనిపోయాడనే విషయం తెలియక చిన్నారి రాత్రంతా తన బాబాయి మృతదేహంపై పడుకొని నిద్ర పోయాడు.

తెల్లవారగానే పొలం పనుల నిమిత్తం అటువైపుగా వెళ్లిన స్థానికులకి ఈ దృశ్యం కనిపించడంతో వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులందరూ సంఘటన స్థలానికి చేరుకునే సమయానికి చిన్నారి తన బాబాయ్ మృతదేహంపై పడుకొని కనిపించాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తరువాత మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. అభం శుభం తెలియని చిన్నారి తన బాబాయ్ చనిపోయాడు అనే విషయం కూడా తెలియక తనపై నిద్రపోవడం పలువురిని కంటతడి పెట్టించింది.