Mokshagna: బాలయ్య కొడుకు విషయంలో పోటీ పడుతున్న ఇద్దరు కూతుర్లు.. లక్కీ ఛాన్స్ ఎవరికో?

Mokshagna: సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బాలయ్య. ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బాలయ్య వారసుడి కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ అదిగో ఇదిగో అంటూనే ఉన్నారు తప్ప ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చినది లేదు.

ఇక మరో ఏడాదిలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఏంటి తప్పకుండా ఉంటుందని తెలుస్తోంది ఇక బాలయ్య కూడా ఈ విషయం గురించి ఇప్పటికే పలు సందర్భాలలో వెల్లడించారు. ఇదిలా ఉండగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి వస్తున్నారనే విషయం తెలియడంతో ఆయన విషయంలో తన ఇద్దరి సోదరులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారని తెలుస్తుంది.

బాలయ్య కుమార్తెలు ఎంతో టాలెంట్ కలిగే ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి బిజినెస్ రంగంలో దూసుకుపోతూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్వయాన కోడలనే విషయం మనకు తెలిసిందే .ఇక చిన్న కోడలు గీతమ్స్ అదినేత శ్రీ భరత్ భార్యగా అందరికీ సుపరిచితమే.

ఈ విధంగా బిజినెస్ రంగంలో దూసుకుపోతూ ఉన్నటువంటి బ్రాహ్మిని తేజస్విని తన తమ్ముడు మోక్షజ్ఞ సినిమాకు నిర్మాతలుగా మారాలని పెద్ద ఎత్తున పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. నారా బ్రాహ్మనికి సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండదని అందుకే తాను బిజినెస్ రంగాన్ని ఎంచుకున్నానని పలు సందర్భాలలో తెలిపారు.

నిర్మాతలుగా బాలయ్య కుమార్తెలు..
ఇకపోతే తేజస్వినికి సినిమాలంటే చాలా ఆసక్తి ఉంది అందుకే ఈమె తన తండ్రి సినిమాలకు తెర వెనుక పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు అంతేకాకుండా బాలకృష్ణ నటిస్తున్న అఖండ సీక్వెల్ చిత్రానికి నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోక్షజ్ఞతో సినిమా చేయడం కోసం ఈ ఇద్దరు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారని తెలుస్తుంది మరి ఆ లక్కీ ఛాన్స్ ఏ సోదరి అందుకుంటుందో తెలియాల్సి ఉంది.