పోసాని పై టాలీవుడ్ ఇండస్ట్రీ సంచలన నిర్ణయం.. ఐదు సంవత్సరాల పాటు నిషేధం?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలకు సినీ నటుడు వైసీపీ నాయకుడు పోసాని మురళి కృష్ణ పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే పోసాని చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ అభిమానులు తనని బూతులు తిడుతున్నారని, తన భార్యను ఎంతో అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలోనే పోసాని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు పోసాని పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే పోసాని ఇంటిపై పవన్ అభిమానులు దాడి చేశారంటూ పోసాని ఆరోపించారు. ఇదిలా ఉండగా పోసాని మురళి కృష్ణ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు నిర్మాతలు సైతం విసుగు చెందుతున్నారు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మా ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో మా అధ్యక్షత పదవికి పోటీ చేసిన వారు సైతం పోసాని వ్యాఖ్యలను ఖండించారు. సినిమా ఇండస్ట్రీలో అందరు ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల ఇండస్ట్రీ పరువుపోతుంది అంటూ తెలియజేశారు.

లేకపోతే పోసాని పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలకు కాను అతనిపై చిత్ర పరిశ్రమ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే అతనికి ఐదు సంవత్సరాల పాటు ఇండస్ట్రీ నుంచి నిషేధం చేయాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితేపోసాని పై అధికారికంగా చర్యలు తీసుకుంటారా లేకపోతే అనధికారికంగా అతనికి ఏ విధమైనటువంటి అవకాశాలు రాకుండా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరి మా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత టాలీవుడ్ పోసాని పై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.