మేకలు కాసే 16 ఏళ్ల బాలికపై 25 రోజులుగా అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..

మేకలు కాస్తున్న ఓ బాలికపై కామాంధులు కన్నేశారు. జీపులో తీసుకువెళ్లి, దాదాపు నెలరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని చురూ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చురూ జిల్లలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలిక మేకలు కాస్తూ ఉంది.

ఆమె 25 రోజుల క్రితం ఓ కొండపైకి వెళ్లింది. అక్కడ నుంచి మేసుకుంటూ మేకలు.. కింద వరకు వస్తుండగా.. వాటిని అనుసరిస్తూ ఆ బాలిక కూడా వచ్చింది. అటు నుంచి ఓ కామాంధుడు జీపులో వచ్చి బలవంతంగా ఆమేను జీపులోకి ఎక్కించాడు. అక్కడ నుంచి ఆమెను జిల్లాలోని మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు.

ఆమె కాపాడండి అంటూ అరుస్తుండగా.. నోటికి ప్లాస్టర్ వేసి మాట రాకుండా మూసి.. వేరే చోటుకు ఆ జీపును తీసుకెళ్లాడు. ఇలా ఆ ప్రదేశంలో ఆమెను 20 నుంచి 25 రోజులుగా రోజూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆమె అక్కడ నుంచి అతడు బయటకు వెళ్లింది చూసి.. ఎలాగోలా బయటపడి తన ఇంటికి వెళ్లి.. అక్కడ తన కుటుంబసభ్యులతో పాటు పోలీస్ స్టేషన్ కు జరిగిన విషయం చెప్పి వారిపై ఫిర్యాదు చేసింది.

ఆ రూంలో అతడితో పాటు మరికొంత మంది తనకు తేనీటిలో మత్తుపదరర్ధాన్ని కలిపి ఇచ్చారని చెప్పింది. ఇలా దాదాపు 25 రోజుల దాకా తనపై అత్యాచారం చేసినట్లు పేర్కొంది. దీనిపై పోలీసులు ఆ నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు . పరారీ లో ఉన్న ఆ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.