రాజస్థాన్ ఎలిజబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (ఆర్ఈఈటీ) ఫర్ టీచర్ పరీక్షలో అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పరీక్ష రాసే వారిలో కొంత మంది చెప్పులో బ్లూటూత్ పెట్టుకుని రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జాగామినేషన్ కు హాజరైన ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా వీరిలో ఒకర్ని అజ్మీర్ లో అదుపులోకి తీసుకున్నారు.
తీగ లాగితే డొంక కదిలినట్లు.. అతడిని విచారించగా మరికొంత మంది భయటపడ్డారు. దానిలో పోలీస్ కానిస్టేబుల్ దేవేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుల్ యధువీర్ సింగ్ కూడా ఉన్నారు. కానీ వాళ్లు ఎగ్జామ్ రాయడానికి కాదు.. వారి భార్యలకు హెల్ఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో వాళ్లిద్దరిని సస్పెండ్ చేశారు. వారిద్దరిని విచారించగా.. ఆ చెప్పులను విద్యార్థులు రూ.6 లక్షల చొప్పున తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ చీటింగ్ చెప్పులను తెలివిగా తయారు చేస్తున్నారని… ఇలాంటి చెప్పులను హార్డ్ వేర్ తో కలిపి ఒక్కో జతను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని విచారణలో తెలిసిందన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ నగరంలో ఇద్దరు పోలీసులు చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్ష జరగడానికి ముందే వాళ్ల దగ్గరకు ప్రశ్నాపత్రం వచ్చింది. దీంతో వాళ్లకు జవాబులు చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో వాళ్లను అదుపులోకి తీసుకొని.. వారిని పోలీసులు మొబైల్ ఫోన్లలో రీట్ పేపర్లు ఉన్నట్లు తెలిపారు. అయితే వారికి ముందుగానే ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా.. ఈ వ్యవహారంలో మొత్తం 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…