మేకలు కాస్తున్న ఓ బాలికపై కామాంధులు కన్నేశారు. జీపులో తీసుకువెళ్లి, దాదాపు నెలరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని చురూ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చురూ జిల్లలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలిక మేకలు కాస్తూ ఉంది.
ఆమె 25 రోజుల క్రితం ఓ కొండపైకి వెళ్లింది. అక్కడ నుంచి మేసుకుంటూ మేకలు.. కింద వరకు వస్తుండగా.. వాటిని అనుసరిస్తూ ఆ బాలిక కూడా వచ్చింది. అటు నుంచి ఓ కామాంధుడు జీపులో వచ్చి బలవంతంగా ఆమేను జీపులోకి ఎక్కించాడు. అక్కడ నుంచి ఆమెను జిల్లాలోని మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు.
ఆమె కాపాడండి అంటూ అరుస్తుండగా.. నోటికి ప్లాస్టర్ వేసి మాట రాకుండా మూసి.. వేరే చోటుకు ఆ జీపును తీసుకెళ్లాడు. ఇలా ఆ ప్రదేశంలో ఆమెను 20 నుంచి 25 రోజులుగా రోజూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆమె అక్కడ నుంచి అతడు బయటకు వెళ్లింది చూసి.. ఎలాగోలా బయటపడి తన ఇంటికి వెళ్లి.. అక్కడ తన కుటుంబసభ్యులతో పాటు పోలీస్ స్టేషన్ కు జరిగిన విషయం చెప్పి వారిపై ఫిర్యాదు చేసింది.
ఆ రూంలో అతడితో పాటు మరికొంత మంది తనకు తేనీటిలో మత్తుపదరర్ధాన్ని కలిపి ఇచ్చారని చెప్పింది. ఇలా దాదాపు 25 రోజుల దాకా తనపై అత్యాచారం చేసినట్లు పేర్కొంది. దీనిపై పోలీసులు ఆ నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు . పరారీ లో ఉన్న ఆ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…