మేకలు కాస్తున్న ఓ బాలికపై కామాంధులు కన్నేశారు. జీపులో తీసుకువెళ్లి, దాదాపు నెలరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని చురూ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చురూ జిల్లలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలిక మేకలు కాస్తూ ఉంది.
ఆమె 25 రోజుల క్రితం ఓ కొండపైకి వెళ్లింది. అక్కడ నుంచి మేసుకుంటూ మేకలు.. కింద వరకు వస్తుండగా.. వాటిని అనుసరిస్తూ ఆ బాలిక కూడా వచ్చింది. అటు నుంచి ఓ కామాంధుడు జీపులో వచ్చి బలవంతంగా ఆమేను జీపులోకి ఎక్కించాడు. అక్కడ నుంచి ఆమెను జిల్లాలోని మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు.
ఆమె కాపాడండి అంటూ అరుస్తుండగా.. నోటికి ప్లాస్టర్ వేసి మాట రాకుండా మూసి.. వేరే చోటుకు ఆ జీపును తీసుకెళ్లాడు. ఇలా ఆ ప్రదేశంలో ఆమెను 20 నుంచి 25 రోజులుగా రోజూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆమె అక్కడ నుంచి అతడు బయటకు వెళ్లింది చూసి.. ఎలాగోలా బయటపడి తన ఇంటికి వెళ్లి.. అక్కడ తన కుటుంబసభ్యులతో పాటు పోలీస్ స్టేషన్ కు జరిగిన విషయం చెప్పి వారిపై ఫిర్యాదు చేసింది.
ఆ రూంలో అతడితో పాటు మరికొంత మంది తనకు తేనీటిలో మత్తుపదరర్ధాన్ని కలిపి ఇచ్చారని చెప్పింది. ఇలా దాదాపు 25 రోజుల దాకా తనపై అత్యాచారం చేసినట్లు పేర్కొంది. దీనిపై పోలీసులు ఆ నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు . పరారీ లో ఉన్న ఆ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…