నగరం నుంచి ఆ ఎయిర్ పోర్ట్ కు చేరుకోవాలంటే కేవలం రూ.10 టికెట్..!

సాధారణంగా విమానాశ్రయాలు నగరానికి పదుల సంఖ్యలో కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. నగరం నుంచి విమానాశ్రయానికి చేరుకోవాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.వేలల్లో కాకపోయినా ఆర్.టి.సి బస్సులో ప్రయాణించిన కూడా దాదాపు ఐదారు వందల వరకు ఖర్చు అవుతుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నగరం నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్లాలనుకునేవారు ప్రత్యేక రైళ్ల ద్వారా కేవలం పది రూపాయలు చెల్లించి సరైన సమయానికి విమానాశ్రయం చేరుకొనే అవకాశం కల్పించింది.

బెంగళూరు కమ్యూటేటర్స్ కు రిలీఫ్ ఇచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ స్పెషల్ ట్రైన్ సర్వీస్ స్టార్ట్ చేసింది. బెంగళూరు నుంచి కెంపెగౌడ ఎయిర్‌పోర్టు వరకూ వెళ్లేందుకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేశారు.సౌత్ వెస్టరన్ రైల్వే దేవనహల్లి స్టేషన్ వరకూ సర్వీస్ మొదలుపెట్టింది. రోడ్ రహిత్, ఫాస్ట్, ఖరీదైన కొత్త సర్వీసును ప్రొవైడ్ చేస్తుంది. సిటీ నుంచి ఎవరైనా సిటీ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లాలంటే ఈ ట్రైన్ ల ద్వారా కేవలం పది రూపాయలకు చెల్లించి వెళ్ళవచ్చు.

ఈ విధంగా విమానాశ్రయాలకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా వెళ్లే వారు చాలామంది ట్రైన్లలో ప్రయాణిస్తే నగరంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా సోమవారం నుంచి ఈ సేవలు ప్రారంభం కావడంతో నగరంలో ఉండే ప్రజలు కెంప గౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు ట్రైన్లలో వెళ్ళవచ్చని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా మరో ఐదారు నెలల్లో ఇదే రూట్ లో మరికొన్ని రైళ్లను కూడా నడిపే ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు తెలియజేశారు.