Amar Deep: పచ్చిగా మాట్లాడుకుందాం అంటూ శివాజీ పై రెచ్చిపోయిన అమర్!

Amar Deep: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో నటుడు అమర్ ఒకరు. బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో రన్నర్ గా బయటకు వచ్చారు. ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ అభిమానులు ఈయనని భారీగా టార్గెట్ చేయడమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత తన కారు పై రాళ్లతో దాడి కూడా చేశారు.

ఇలా పల్లవి ప్రశాంత్ శివాజీ ఈయన పై పరోక్షంగా ఎన్నో కామెంట్లు కూడా చేశారు. కానీ ఎప్పుడూ కూడా అమర్ వారి గురించి మాట్లాడిన సందర్భాలు లేవు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అమర్ శివాజీని ఉద్దేశించి డైరెక్టర్గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఇంటర్వ్యూలో అమర్ ను శోభా శెట్టి పలు ప్రశ్నలు వేశారు.ఈ చాట్ షోలో శోభా శెట్టి అమర్ దీప్ సైలెన్స్ ని బ్రేక్ చేసింది. అమర్ పై వస్తున్న నెగిటివిటీకి సమాధానం రాబట్టింది. అమర్ నాలుగైదు వారాలకు మించి హౌస్ లో ఉండరు బయటకు వచ్చేస్తారంటూ చాలామంది కామెంట్ చేశారు. ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏంటి అంటూ ఈమె ప్రశ్నించారు.

నేనే కింగ్.. నేనే బొంగు..

ఈ ప్రశ్నకు అమర్ సమాధానం చెబుతూ..పచ్చిగా మాట్లాడుకుందాం.. మొదటి 5 వారాలు నేను కంటెంట్ ఇవ్వలేదు ఓకె నేను ఒక్కడినేనా ఇంకెవ్వరూ లేరా? వాళ్ళు నాకు దేవుళ్ళు అని భజన చేస్తే.. నాకు నేను కూడా అంతే. నాకు నేనే కింగ్.. నాకు నేనే బొంగు.. నీకుందుకురా అంటూ అమర్ డైరెక్ట్ గా శివాజీకి కౌంటర్ ఇచ్చారు ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.