సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఆనందయ్య మందు పంపిణీ..

కరోనాను అడ్డుకోవడానికి నెల్లూరు జిల్లా, కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఈరోజు ననుండి పంపిణీ చేపట్టారు.

ముందుగా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలకు ఆనందయ్య ఆయుర్వేద మందును ఇస్తున్నారు. మందుకోసం క్యూలో నిల్చున్న వారికి ఇబ్బందులు పడకుండా ఆనందయ్య సోదరుడు మరియు వారి యొక్క బృందం మందును పంపిణీ చేస్తున్నారు. అయితే ఆనందయ్య మందు కోసం నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.