Anasuya: రాజుల కాలం అయితే ఇంకో తాజ్ మహల్ ఉండేదేమో.. అనసూయ కామెంట్స్ వైరల్!

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెర సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇలా వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా వెండితెర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె బుల్లితెరకు దూరమైన సంగతి మనకు తెలిసిందే. అయితే వెండితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అనసూయ తనుకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా తన విషయాలను మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు ఈమె గ్లామరస్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు తాజాగా ట్రెండీ వేర్ లో అనసూయ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె రాజుల కాలం కాదు రథం గుర్రం లేదు. ఒకవేళ రాజుల కాలం అయితే ఏ రాజో ఎత్తుకెళ్లిపోయేవాడు.. ఇంకో తాజ్ మహల్ కూడా ఉండేదేమో అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఏ రాజో ఎత్తుకెళ్లిపోయేవాడు..

ఇలా రాజుల కాలం కాదు రాజో ఎత్తుకెళ్లిపోయేవాడు అంటూ ఈమె కామెంట్స్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈమె పుష్ప 2 సినిమాతోపాటు రజకార్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.