Anchor Anasuya: నొక్కితే నొక్కించుకోవాలి తప్ప మేం మాట్లాడకూడదు…అనసూయ షాకింగ్ కామెంట్స్ ?

Anchor Anasuya: గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో కాలం బుల్లితెర మీద యాంకర్ గా సందడి చేసిన అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరమే వెండితెర మీద ప్రేక్షకులను అలరిస్తోంది. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో అనసూయకి సినిమాలలో మంచి మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

ఈ క్రమంలో టీవీ షోలకు దూరంగా ఉంటూ సినిమాల పైన ఫోకస్ పెట్టింది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. తాజాగా మరొకసారి అనసూయ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ..” సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా పురుషాధిక్యమే నడుస్తోంది. ఇక్కడ హీరోలను ఆధారం చేసుకుని సినిమాలు చేస్తుంటారు. అంతేకానీ హీరోయిన్లను ఎక్కువగా పట్టించుకోరు. సినిమాలలో కేవలం మేము సాయం కోసం అరిస్తే హీరోలు వచ్చి కాపాడతారు. అంతే తప్ప అందులో మాకు ఇంపార్టెన్స్ ఉండదు అంటూ చెప్పుకొచ్చింది.

Anchor Anasuya: హీరోలకే ప్రాధాన్యత…

అంతే కాకుండా ” సినిమాల్లో హీరోలు అవి నొక్కితే నొక్కించుకోవాలి తప్ప…మేం మాట్లాడకూడదు. వారు ఏం చేసినా కూడా మేం చేయించుకోవాలి అంటూ సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే అనసూయ మాత్రమే కాకుండా ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు కూడా సినిమా ఇండస్ట్రీలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని వాపోతున్నారు.