Aadi Saikumar: ప్రముఖ నటుడు సాయికుమార్ వారసుడిగా ప్రేమ కావాలి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే ఆదికి మంచి గుర్తింపు లభించింది. అయితే ఆ తర్వాత ఆది నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి.
అయినప్పటికీ అది మాత్రం తన ప్రయత్నాలు విరమించుకోకుండా ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల అది తన భార్య అరుణతో కలిసి మొదటిసారిగా టీవీ షోలో పాల్గొన్నాడు..వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ” అలా మొదలైంది ” షో లో ఆది, అరుణ సందడి చేశారు.
ఆది, అరుణ ది పెద్దలకుదురుచిన వివాహం. ఈ షోలో వీరిద్దరూ తమ వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారి పెళ్లిచూపులు ఎయిర్పోర్టులో జరిగాయని, అయితే మొదటి మీటింగ్ లోనే గంటలు తరబడి మాట్లాడటంతో వారి పేరెంట్స్ అడ్డుగా వచ్చారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పెళ్లి తర్వాత హనీమూన్ కి వెళ్ళినప్పుడే ఇద్దరు గొడవపడ్డారని తెలిపారు.
ఇక ఆది భార్య అరుణ మాట్లాడుతూ.. ఇంట్లో ఆది డామినేషన్ ఎక్కువగా ఉంటుందని, ఇప్పటివరకు తన ఫోన్ పాస్వర్డ్ కూడా చెప్పలేదని తెలిపింది. దీంతో ఆది స్పందిస్తూ ఫోన్ పర్సనల్ కాబట్టి నేను ఎప్పుడూ తనకి ఫోన్ ఇవ్వను అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆది కి సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇవ్వలేదని, తాను ఇచ్చిన గిఫ్టులు కూడా పోగొట్టాడని అరుణ తెలిపింది. ఆది చేతుల మీద ఓ ఆమ్లెట్ వేయించుకుని తినాలనే తన కోరిక ఇప్పటికి నెరవేరలేదని అరుణ చెప్పింది. దీంతో వెన్నెల కిషోర్ తాను సహాయం చేస్తానని చెప్పి ఆదిని కష్టపెట్టే ఒక ఆమ్లెట్ వేయించాడు. మొత్తానికి ఇలా అరుణ కోరిక నెరవేరింది. అయితే ఈ విషయం గురించి తెలిసిన నెటిజన్లు ఇలాంటి చిన్నచిన్న కోరికలు కూడా ఉంటాయా? అని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…