Rangastalam Mahesh: రంగస్థలం, మహానటివంటి సినిమాలలో కీలక పాత్రలలో నటించిన మహేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. మహేష్ ఇలా నటుడిగా మాత్రమే కాకుండా జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అంతేకాకుండా యూట్యూబర్ గా కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడి పాత్ర వల్ల మహేష్ కి మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత మహానటి సినిమాలో సావిత్రికి అసిస్టెంట్గా నటించాడు. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ మహేష్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో తన తండ్రి చనిపోయిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
ఈ ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ.. నితిన్ గారి ఆఫీస్ లో ఫోటో ఇచ్చి అలా బయటికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో నాన్నగారు చనిపోయినట్లు ఫోన్ వస్తే ఇంటికి వెళ్లాను. అయితే ఆ సమయంలో కన్నతండ్రి శవాన్ని స్మశానం వరకు తీసుకెళ్లి అంత్యక్రియల కోసం పుల్లలు తేవడానికి కూడా డబ్బు లేని స్థితిలో ఉన్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో కన్న తండ్రి దహనానికి కూడా డబ్బులేని పరిస్థితిలో ఉన్న నాకు ఎందుకురా ఈ జీవితం అనిపించింది.
ఆ సమయంలో నాకు దగ్గరైన వాళ్లు కూడా నన్ను తిట్టారు అంటూ మహేశ్ చెప్పుకొచ్చాడు. మనం ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు జీరో..కానీ ఇక్కడ కష్టపడి సంపాదించిన అంతా మన జీవితానికి ప్లస్ అవుతుంది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒక సాధారణ మనిషిలా జీవించాలని అశ్విని దత్ గారు చెప్పారు. ఇప్పటికీ వారి ప్రొడక్షన్లో ఉన్న ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇస్తారు అంటూ మహేష్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…