Jabardasth: అనసూయ స్థానంలోకి వచ్చిన కొత్త యాంకర్.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన టీమ్?

Jabardasth: బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇక గత 10 సంవత్సరాల నుంచి ఎంతో ఆదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారిలో ఒక్కొకరు బయటకు వెళ్తున్నారు.

ఇప్పటికే నాగబాబు రోజా వెళ్లిపోగా హైపర్ ఆది సుడిగాలి సుదీర్ కూడా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలో నుంచి బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ కూడా ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలిసిందే. గత వారం జరిగిన ఎపిసోడ్ అనసూయకు జబర్దస్త్ కార్యక్రమంలో చివరి ఎపిసోడ్ కావడంతో జబర్దస్త్ టీమ్ తనకు వీడ్కోలు పలికారు.

ఇకపోతే ఈ కార్యక్రమం నుంచి అనసూయ వెళ్లిపోవడంతో అనసూయ స్థానంలోకి ఎవరు వస్తారని పెద్ద ఎత్తున ఆత్రుత ఏర్పడింది. అయితే గతంలో అనసూయ తన రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో అనసూయ స్థానాన్ని రష్మి భర్తీ చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి తిరిగి రష్మి రాబోతుందని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మరొక యాంకర్ మంజుష ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

Jabardasth: పల్లకిలో వచ్చిన కొత్త యాంకర్…

ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ టీమ్ కొత్త యాంకర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఏకంగా ఆమెను పల్లకిలో మోసుకొని తీసుకువచ్చారు. అయితే ఆమె ఎవరు ఏంటి అనే విషయం తెలియకుండా సస్పెన్స్ లో పెట్టారు.మరి అనసూయ స్థానంలో జబర్దస్త్ కార్యక్రమానికి రాబోయే ఆ కొత్త యాంకర్ ఎవరు ఏమిటి అనేది తెలియాలంటే మరొక రెండు రోజులు వేచి ఉండాలి.