Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

Andhrapradesh: ఏపీలో ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. కొత్తగా ప్రకటించిన పీఆర్సీ తమకు సమ్మతం కాదని.. ఉద్యోగులు నిరసన బాట పట్టారు. తమ నిరసనలను కొనసాగిస్తూ… ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!
Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

మరోవైపు తమ డిమాండ్ల నెరవేరకపోతే ఈ నెల 7 నుంచి సమ్మెకు వెళ్తామని ఇదివరకే హెచ్చరించారు. 
మరోవైపు ప్రభుత్వం ఉద్యోగులను బుజ్జగించేందుకు మంత్రులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు తమ సమస్యలను మంత్రుల కమిటీకి చెప్పాలని చర్చలకు ఆహ్వానించారు.

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

అయితే ఉద్యోగుల మాత్రం చాలా సార్లు కమిటీ ఆహ్వానానికి స్పందించలేదు. అయితే నిన్న మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. కాగా ముఖ్యంగా మూడు డిమాండ్లపై ఉద్యోగులు పట్టుబట్టడంతో చర్చలు విఫలం అయ్యాయి. 


ఉద్యోగులు నిరసనలు, ఆందోళనతో..

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు నిరసనలు, ఆందోళనతో ఏమాత్రం భయపడటం లేదు. తాజాగా ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. ఓ వైపు నిరసనలు, ఆందోళనలను పట్టించుకోకుండా… రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అకౌంట్లలో వేతనాలను జమచేసింది. పదకొండవ పీఆర్సీ ప్రకారం ఉద్యో గుల అకౌంట్లలో ఉదయం నుంచే వేతనాలు పడిపోయాయి. ప్రతి నెలా ఉద్యోగులకు ఆలస్యంగా వేతనాలు అందుతుండగా.. ఈ నెలలో మాత్రం బుధవారం ఉదయం లోపు అందరికీ వేతనాలు పడ్డాయి. ఇదిలా ఉంటే ట్రెజరీ ఉద్యోగులకు మాత్రం వేతనాలు ఇంకా పడలేదు. వేతన బిల్లులు ప్రాసెస్ చేయకపోవడంతో.. ట్రెజరీ ఉద్యోగులపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు.