Tirumal Tirupati Devasthanam: ఆధ్యాత్మిక నగరం తిరుపతికి రోజురోజు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో తిరుపతి నగరం వేగంగా విస్తరిస్తోంది.
దీంతో ఇటు భక్తులు, అటు నగరవాసుల పెరుగుతుండటం.. ఫలితంగా వాహనాల రాకపోకలు ఎక్కువ అవ్వడంతో తిరుపతి నగరాన్ని ట్రాఫిక్ సమస్యలు వేధిస్తున్నాయి. అయితే తాజాగా తిరుపతి వాసులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోంది.
నగరంలోని ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీంతో పాటు భక్తులు కొండపైకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. టీటీడీ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పోరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్, గరుడ వారధి వారం, పది రోజుల్లో తిరుపతి వాసులకు అందుబాటులోకి రానుంది.
ఫ్లై ఓవర్ నిర్మాణ ఖర్చులో టీటీడీ 67 శాతం భరించగా… తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల నుంచి 33 శాతం కేటాయిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో ఇప్పటి వరకు టీటీడీ రూ. 75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం బస్టాండ్ నుంచి అలిపిరి వరకు గరుడ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. తర్వాత కడప మార్గం నుంచి తిరుపతి నగరంతో సంబంధం లేకుండా మరో కనెక్షన్ ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఆఫ్కాన్ సంస్థ ప్రయత్నిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…