Indian Premier League: ఐపీఎల్ వేలానికి పేరు నమోదు చేసుకున్న బెంగాల్ మంత్రి..! వివరాల్లోకి వెళ్తే..
Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) కోసం క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా గత రెండు సీజన్లు దుబాయ్ వేదికగా జరగడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా ఈ ఐపీఎల్ మాత్రం ఇండియాలోనే జరగుతున్నట్లు బీసీసీఐ ఇదివరకే క్లారిటీ ఇచ్చింది.
దీనికోసం త్వరలో ఐపీఎల్ కొత్త సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కూడా ప్రారంభం అయింది. ఇప్పటికే అన్ని జట్లు తమ స్ట్రాటజీలతో ఉన్నాయి. ఏ ప్లేయర్ ను తీసుకోవాలనే క్లారిటీతో ఉన్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్ జట్టు వేళంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నైకి చేరుకున్నాడు. ఇతర జట్ల యాజమాన్యాలు కూడా ప్లేయర్ల వేలంపై కసరత్తు చేస్తున్నాయి.
తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. వెస్ట్ బెంగాల్ మంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ నేత మనోజ్ తివారీ కూడా ఈసారి ఐపీఎల్ వేలంలో నిలవనున్నారు. తన పేరును వేలం కోసం నమోదు చేసుకున్నాడు. క్రికెట్ అయిన మనోజ్ తివారీ గతేడాది బెంగాల్ ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ తరుపున శిభ్ పూర్ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువతా మమతా బెనర్జీ మంత్రి వర్గంలో క్రీడల శాఖ మంత్రి పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం వేలంలో పేరు నమోదు చేసుకున్న మనోజ్ తివారీ.. తన ప్రారంభం ధరను రూ. 50 లక్షలుగా పేర్కొన్నాడు. గతంలో ఇండియా తరుపున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. మొత్తం 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ టోర్నీలో కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగ్ పూణే జాయింట్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…