Pitapuram: పిఠాపురం పై ఫోకస్ చేసిన వైసీపీ అధిష్టానం.. పవన్ ఓటమి లక్ష్యమా?

Pitapuram: ఏపీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో వైసిపి అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో భాగంగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి రాబోతున్నారు కూటమి నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి రాబోతున్నారు.

ఎలాగైనా పిఠాపురం నియోజకవర్గం నుంచి వంగా గీత గెలుపొందే దిశగా వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తుంది.ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కన్నబాబు, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రీజనల్ కో- ఆర్డినేటర్ మిథున్ రెడ్డిలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మండలాల వారిగా నేతలకు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇక నేడు ముద్రగడ్డ పద్మనాభం వంగ గీతా నేడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.

కాపు ఓట్లే లక్ష్యంగా..
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో టిడిపి పార్టీకి చెందిన వారందరినీ కూడా వైసిపి పార్టీలోకి చేరే విధంగా దృష్టి పెట్టాలా చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపుకు మళ్లించేలా సీఎం జగన్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 90వేలకుపైగా కాపు ఓటర్లు ఉన్నారు. మెజార్టీ కాపు ఓటర్లను వైసీపీకి వైపుకు మళ్లిస్తే గీత గెలుపు ఖాయం అవుతుందని భావిస్తున్నారు ఎలాగైనా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా అధిష్టానం అడుగుల ముందుకు వేస్తున్నారని తెలుస్తుంది.