Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

Schemes Fraud: ప్రస్తుతం నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంట్లోకి చొరబడి దోచేయడం వంటివి చాలా వరకు తగ్గిపోయాయి. ప్రస్తుతం అంతా వైట్ కాలర్ మోసాలే జరుగుతున్నాయి. మనకు తెలియకుండా మన బ్యాంక్ అకౌంట్ల లోకి చొరబడుతున్నారు.

Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

అమాయకపు ప్రజలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఓటీపీ, డెబిట్ కార్డ్ పిన్ లతో మోసాలకు పాాల్పడుతున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ తరహా నేరాలు ఎక్కువగా నమోాదయ్యాయి. మనం మోసపోవడానికి మనచేతిలోని సెల్ ఫోన్, ఇంటర్నెట్ కారణమవుతోంది. టెక్నాలజీని యూజ్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ఇదిలా ఉంటే కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అధిక వడ్డీ, తక్కువ కాల వ్యవధి చూపుతూ… ఇన్వెస్ట్ చేయమంటూ.. స్కీముల పేరుతో మోసం చేస్తున్నారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపుతుండటంతో ప్రజలకు కూడా ఏం విచారణ చేయకుండా… సింపుల్ గా మోసపోతున్నారు.

సంబంధిత సమాచారం మొత్తం తెలుసుకోవాలి..

డబ్బులన్నీ స్కీముల్లో పెట్టి చివరకు ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొత్తగా వస్తున్న స్కీములకు సంబంధించిన మోసాలను పోంజి స్కీమ్స్ అని కూడా అంటారు. ఎప్పుడైనా స్కీముల పేరుతో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని కోరితే పూర్తిగా తెలుసుకొని ప్రొసీడ్ కావాలి. డబ్బులు పెట్టడానికి ముందే లిఖిత పూర్వకంగా ఇన్వెస్ట్మెంట్ కు  సంబంధిత సమాచారం మొత్తం తెలుసుకోండి.  అలానే ఇన్వెస్ట్మెంట్ ప్రమోటర్ను అడగడం, బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయండి. సర్వీసులు అందించడానికి లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోండి.