ork From Home: కరోనా కారణంగా ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ, సేవల రంగాలకు చెందిన ఉద్యోగులు గత రెండేళ్ల నుంచి ఇంటి నుంచే తమ
Work From Home: కరోనా కారణంగా ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ, సేవల రంగాలకు చెందిన ఉద్యోగులు గత రెండేళ్ల నుంచి ఇంటి నుంచే తమ ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. అయితే డిసెంబర్ లో మళ్లీ ఆఫీసులకు రావాలంటూ ఉద్యోగులకు పిలుపు వచ్చింది.
అయితే థర్డ్ వేవ్, ఓమిక్రాన్ భయాల వల్ల మళ్లీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే దీర్ఘకాలం వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజులో ఒకే ప్రదేశంలో కూర్చుని పనిచేస్తుంటారు ఉద్యోగులు. ఇలా చేస్తూనే ఏదో ఒకటి తింటూ ఉంటారు.
దీని వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ ముందు కోర్చోవడమే కాదు… శరీరానికి కాస్త వ్యాయామం అవసరమంటున్నారు.ఇలాగే పనిచేస్తే 20 ఏళ్లలో విపరీతంగా బరువు పెరిగిపోవడంతో పాటు ఉబకాయం, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వంటి జబ్బులు వస్తాయి.
దీంతో పాటు రిపీటెట్ టైపింగ్ స్ట్రెస్, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. వెన్నెముక నొప్పితో పాటు మెడ నొప్పులు వస్తాయి. దీంతో పాటు చర్మం పొడిబారిపోతుంది.వీటన్నింటికి చెక్ పెట్టాలంటే వ్యాయామమే సరైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు గంట – 2 గంటలకు ఓసారైనా పనిని పక్కన పెట్టి నడవాలంటున్నారు. దీంతో పాటు ఉదయం వ్యాయామం చేయాలని చెబుతున్నారు. రోజుకు కంప్యూటర్ పై 6-8 గంటల పనిని మాత్రమే చేయాలంటున్నారు. 7-9 గంటలు చక్కని నిద్ర అవసరమని చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో గడపటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…