Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
Schemes Fraud: ప్రస్తుతం నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంట్లోకి చొరబడి దోచేయడం వంటివి చాలా వరకు తగ్గిపోయాయి. ప్రస్తుతం అంతా వైట్ కాలర్ మోసాలే జరుగుతున్నాయి. మనకు తెలియకుండా మన బ్యాంక్ అకౌంట్ల లోకి చొరబడుతున్నారు.
అమాయకపు ప్రజలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఓటీపీ, డెబిట్ కార్డ్ పిన్ లతో మోసాలకు పాాల్పడుతున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ తరహా నేరాలు ఎక్కువగా నమోాదయ్యాయి. మనం మోసపోవడానికి మనచేతిలోని సెల్ ఫోన్, ఇంటర్నెట్ కారణమవుతోంది. టెక్నాలజీని యూజ్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
ఇదిలా ఉంటే కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అధిక వడ్డీ, తక్కువ కాల వ్యవధి చూపుతూ… ఇన్వెస్ట్ చేయమంటూ.. స్కీముల పేరుతో మోసం చేస్తున్నారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపుతుండటంతో ప్రజలకు కూడా ఏం విచారణ చేయకుండా… సింపుల్ గా మోసపోతున్నారు.
డబ్బులన్నీ స్కీముల్లో పెట్టి చివరకు ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొత్తగా వస్తున్న స్కీములకు సంబంధించిన మోసాలను పోంజి స్కీమ్స్ అని కూడా అంటారు. ఎప్పుడైనా స్కీముల పేరుతో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని కోరితే పూర్తిగా తెలుసుకొని ప్రొసీడ్ కావాలి. డబ్బులు పెట్టడానికి ముందే లిఖిత పూర్వకంగా ఇన్వెస్ట్మెంట్ కు సంబంధిత సమాచారం మొత్తం తెలుసుకోండి. అలానే ఇన్వెస్ట్మెంట్ ప్రమోటర్ను అడగడం, బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయండి. సర్వీసులు అందించడానికి లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోండి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…