బిగ్ బాస్ నుంచి బిగ్ సర్ ప్రైజ్… 22 నుంచి క్వారంటైన్..!

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో గురించి రోజుకు కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం గురించి వస్తున్న వార్తలకు త్వరలోనే బిగ్ బాస్ చెక్ పెట్టనుంది. కరోనా ప్రభావం వల్ల ఈ ఏడాది బిగ్ బాస్ ఉంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోగోను విడుదల చేస్తూ ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతోంది అంటూ నిర్వాహకులు తెలియజేశారు.

బిగ్ బాస్ సెప్టెంబర్ ఐదు నుంచి ప్రసారం కాబోతుందనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే తొందరలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ నుంచి సరికొత్త సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 15న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన కంటెస్టెంట్ ల ఎంపిక పూర్తి అయిందని, వారందరిని ఆగస్టు 22వ తేదీన క్వారంటైన్ లోకి పంపించనున్నారని సమాచారం.15 రోజులు క్వారంటైన్ పూర్తిచేసుకున్న కంటెస్టెంట్ లో నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు డోస్ లు పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు.

ఈ క్రమంలోనే ఈసారి సీజన్ ఫైవ్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్లేనంటూ కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ జశ్వంత్, శ్వేత, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక,ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి,నటి లహరి, నవ్వస్వామి, కార్తీక దీపం భాగ్యం పేర్లు వినపడుతున్నాయి. అదేవిధంగా ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు.