పబ్లిక్ గా బాటిల్ ఎత్తిన ఛార్మి.. పక్కనే పూరీ కూడా..?

ఛార్మి.. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది.. ఆ సమయంలో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్ సరసన నటించింది. ఇక కింగ్ నాగార్జునతో నటించిన మాస్ సినిమా హీరోయిన్ గా ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ తరువాత ‘మంత్ర’, ‘జ్యోతి లక్ష్మీ’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే హీరోయిన్ గా ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గడంతో దర్శకుడు పూరీ జగన్నాథ్ తో అత్యంత సన్నిహితంగా ఉండే ఛార్మి ఆయనతో కలిపి ‘పూరీ కనెక్ట్స్’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేసి నిర్మాతగా మారింది చార్మి.

ఈ బ్యానర్ లో రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’, నందమూరి బాలకృష్ణ హీరోగా ‘పైసా వసూల్’ వంటి పలు చిత్రాలు నిర్మిచారు. ఇక పూరి – ఛార్మి మధ్య ఎదో జరుగుతుంది అనేది ఇండస్ట్రీ లో ఉన్న టాక్. ఈ క్రమంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎక్కడ ఉంటే ఛార్మి కూడా అక్కడ ప్రత్యక్షమవుతుంది. తాజగా ఛార్మి ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్నా పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ షూటింగ్ కోసం విదేశాలు వెళ్ళారు ఛార్మి.. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఒక స్ట్రీట్ సైడ్ ఉన్న రెస్టారెంట్ లో కూల్ డ్రింక్ తాగుతున్న వీడియో షేర్ చేశారు. అయితే లెమన్, జింజర్ కలిసిన డ్రింక్ అంటూ క్యాప్షన్ పెట్టారు ఛార్మి. అయితే కొందరు మాత్రం చార్మీ బీర్ తాగుతుంది అనుకుని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ సమయంలో ఛార్మితో పాటూ ఎదురుగా దర్శకుడు పూరి కూడా కుర్చుని ఉన్నారు.