ఇటీవల కరోనా పాజిటివ్ సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్(72) మాస్టర్ కన్నుమూశారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది సేపటి క్రితమే అటే రాత్రి 8 గంటల సమయంలో మరణించాడు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకడంతో కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.
అతడు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. తుది శ్వాస విడిచారు. ఇక అటు శివశంకర్ మాస్టర్ పెద్ద కొడుకు విజయ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మాస్టార్ సినీ విషయానికి వస్తే.. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో శివశంకర్ మాస్టర్కు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టార్ గానే కాకుండా అతడు 30 చిత్రాల్లో కూడా నటించాడు. ఇటీవల కాలంలో అతడు ఓంకార్ సోదరుడి సినిమాలో ఓ కీలక పాత్రను కూడా పోషించాడు.
శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం అతడు కొన్ని టీవీ షోల్లో జడ్జ్గానూ వ్యవహరిస్తున్నారు. శివశంకర్ మాస్టర్ 800 చిత్రాలకు పైగా వర్క్ చేశారు. శివశంకర్ మాస్టార్ కన్నుమూతతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
అతడికి కరోనా సోకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం తెలవగానే .. సోనూసూద్, హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి, మంచు విష్ణు, లారెన్స్ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు. శివ శంకర్ మాస్టర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పౌరాణిక కథలపై తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న…
టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ చిత్రాల్లో ఒకటైన రణబాలి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రేమపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. జీవితంలో…
టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ ప్రత్యేకమైన ప్రేమ కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. యవ్వనంలో…
టాలీవుడ్లో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రిద్ధి కుమార్. సహజమైన అందం, సింపుల్…
భారతదేశంలో దేవాలయాలకు వెళ్లినప్పుడు లడ్డూ, పులిహోర, పండ్లు వంటి సంప్రదాయ ప్రసాదాలు అందుకోవడం సాధారణం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని…