కరోనా సోకిందేమో అని భయంతో.. మనస్తాపానికి గురై ఉరివేసుకున్న దంపతులు..!

“కరోనా వైరస్..” ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున వైరస్. మన దేశంలో కూడా సెంకడ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నవారు కొందరైతే మరికొందరు తమకు కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్యలు చేస్తుకున్నవారు మరికొందరు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం.

తాజగా ఆంద్రప్రదేశ్, కృష్ణా జిల్లా, పెడన గ్రామంలో ఇటువంటి విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందినా లీలాప్రసాద్ (40), భారతీ (38) దంపతులు కాస్త అస్వస్థతకు గురికావడంతో.. వారికీ కరోనా సోకిందనే భయంతో తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో గురువారం రాత్రి దంపతులిద్దరూ వారి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా వచ్చినా కూడా వెంటనే చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నా కొందరు మాత్రం అనవసరమైన భయంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ తనువు చాలిస్తున్నారు.