Crime News: అతడికి 63 ఏళ్లు..కోరిక తీర్చలేదని కోడలిని ఏం చేశాడంటే..!

Crime News: అతడికి 63 ఏళ్లు..కోరిక తీర్చలేదని కోడలిని ఏం చేశాడంటే..!

Crime News: రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలకు సంబంధించి వార్తలు వింటూనే ఉన్నాం. దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా… కామాంధుల్లో మార్పులు రావడం లేదు. దిశ, నిర్భయ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చానా… కామాంధుల్లో భయం లేకుండా ఉంది.

Crime News: అతడికి 63 ఏళ్లు..కోరిక తీర్చలేదని కోడలిని ఏం చేశాడంటే..!
Crime News: అతడికి 63 ఏళ్లు..కోరిక తీర్చలేదని కోడలిని ఏం చేశాడంటే..!

వావీ వరసలు మరచి, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగానే జరిగాయి. ముఖ్యంగా మనకు దగ్గరగా ఉండే వారి నుంచే లైంగిక వేధింపులు ఎదురుకుంటున్నారు. బాలికల దగ్గర నుంచి యువతుల దాకా దుర్మార్గుల చేతిలో పడుతున్నారు. 

Crime News: అతడికి 63 ఏళ్లు..కోరిక తీర్చలేదని కోడలిని ఏం చేశాడంటే..!

ఇదిలా ఉంటే సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ దుర్మార్గుడు. మామ అయి ఉండి కోడలను కోరిక తీర్చాలని వేధించసాగాడు. చివరకు ఆమె పాలిట యముడిగా మారాడు. అత్తామామలు అంటే తల్లిదండ్రులతో సమానం అంటారు.. కానీ ఈ దుర్మార్గుడు మాత్రం సొంత కోడలినే చెరబట్టాలని చూశారు. చివరకు కోరిక తీర్చలేదని కోడలును దారుణంగా హతమార్చాడు. 


రజితపై కోపం పెంచుకున్న మామ..

వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా కురవి మండల కేంద్రం శివారులోని సోమ్లా తండాలో జరిగింది. భూక్యా హచ్చ తన కొడుకు భార్య కోడలు రజితపై కన్నేశాడు. పలుసార్లు తన కోరిక తీర్చాలని ఒత్తడి చేస్తూ  వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని రజిత తన కుటుంబ సభ్యులతో చెప్పడంతో వాళ్లు మామ భూక్యా హచ్చను హెచ్చరించారు.  ఈనేపథ్యంలోనే రజితపై కోపం పెంచుకున్న మామ.. ఎవరూ లేని సమయంలో దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. హత్య సమయంలో రజిత భర్త కూలి పనులకు వెళ్లగా, కూతుళ్లు గురుకులంలో చదువుకుంటున్నారు. హత్య చేసిన అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.