Devineni Uma: స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారిపోయింది… జగన్ కి అదే దిక్కు!

Devineni Uma: ఆంధ్రప్రదేశ్లో జగన్ రాక్షస పాలనకు ప్రజలు విసిగిపోయారని వచ్చే ఎన్నికలలో ఓటుతో జగన్ కి బుద్ధి చెప్పబోతున్నారని తెలుగుదేశం నేతలు అధికార పార్టీ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

గతంలో నారా చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు రాష్ట్రం ఇప్పుడు గంజాయి అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారిపోయిందని తెలిపారు. ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రాన్ని ప్రస్తుత పట్టించారని ఉమా వెల్లడించారు. ఇక జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళిత వర్గానికి చెందినవారు పూర్తిగా అణచివేయబడ్డారని ఉమా ఈ సందర్భంగా తెలియజేశారు.

వైసిపి దుర్మార్గపు పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకే ప్రజా చైతన్య యాత్రలు, గౌరవ సభలను చంద్రబాబు నాయుడు రూపొందించారని అన్నారు.ఇక జగన్ మొద్దు నిద్ర మేల్కొల్పడానికి చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారని తెలిపారు. ఆంధ్ర ప్రజలు యువత ఆయనని గద్దెదించి తిరిగి అధికారాన్ని చంద్రబాబు చేతిలో పెట్టాలని ఎదురుచూస్తున్నారని ఉమా తెలిపారు.

Devineni Uma: బంగాళాఖాతంలో కలిపేయాలి…


వైసిపి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు నాయుడు మాటలు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా కదిలిస్తున్నాయని ఈయన తెలిపారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసే బహిరంగ సభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఈయన కోరారు.