Devineni Uma: ఆంధ్రప్రదేశ్లో జగన్ రాక్షస పాలనకు ప్రజలు విసిగిపోయారని వచ్చే ఎన్నికలలో ఓటుతో జగన్ కి బుద్ధి చెప్పబోతున్నారని తెలుగుదేశం నేతలు అధికార పార్టీ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
గతంలో నారా చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు రాష్ట్రం ఇప్పుడు గంజాయి అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారిపోయిందని తెలిపారు. ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రాన్ని ప్రస్తుత పట్టించారని ఉమా వెల్లడించారు. ఇక జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళిత వర్గానికి చెందినవారు పూర్తిగా అణచివేయబడ్డారని ఉమా ఈ సందర్భంగా తెలియజేశారు.
వైసిపి దుర్మార్గపు పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకే ప్రజా చైతన్య యాత్రలు, గౌరవ సభలను చంద్రబాబు నాయుడు రూపొందించారని అన్నారు.ఇక జగన్ మొద్దు నిద్ర మేల్కొల్పడానికి చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారని తెలిపారు. ఆంధ్ర ప్రజలు యువత ఆయనని గద్దెదించి తిరిగి అధికారాన్ని చంద్రబాబు చేతిలో పెట్టాలని ఎదురుచూస్తున్నారని ఉమా తెలిపారు.
వైసిపి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు నాయుడు మాటలు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా కదిలిస్తున్నాయని ఈయన తెలిపారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసే బహిరంగ సభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఈయన కోరారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…