తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని కొత్త దిశలో ప్రారంభిస్తూ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో నిర్వహించిన భారీ సభలో ఈ ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.
తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కవిత ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఆత్మను కాపాడేందుకు, ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కొత్త రాజకీయ వేదిక అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ లక్ష్యాలు, ప్రాధాన్యాలపై కూడా వివరించారు.
ప్రజల ముందుకు ఐదు ముఖ్య హామీలతో కవిత వచ్చారు. విద్య, వైద్య రంగాల్లో ప్రజలపై భారం తగ్గించేలా ఉచిత సేవలను అందిస్తామని తెలిపారు. రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ‘రైతే రాజు’ నినాదంతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారీ స్థాయిలో ఆర్థిక సాయం, ఉద్యోగాల భర్తీ చేపడతామని హామీ ఇచ్చారు.
సామాజిక న్యాయం తమ పార్టీ ముఖ్య అజెండాగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కవిత, తెలంగాణ జాగృతి ద్వారా ప్రజలతో అనుబంధాన్ని కొనసాగించారు. 2014లో నిజామాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికైన ఆమె, అనంతరం రాజకీయంగా ఎదురుదెబ్బలు కూడా ఎదుర్కొన్నారు. తర్వాత ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎన్నికయ్యారు.
ఇటీవల జరిగిన పరిణామాలు, ముఖ్యంగా పార్టీతో విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తి నేపథ్యంలో కవిత బీఆర్ఎస్కు దూరమయ్యారు. పార్టీ నుంచి సస్పెన్షన్ అనంతరం వెంటనే సభ్యత్వానికి రాజీనామా చేసి, కొత్త దిశగా అడుగులు వేశారు. తెలంగాణలో ప్రజల ఆశయాలకు కొత్త వేదికగా తమ పార్టీ పనిచేస్తుందని ఆమె తెలిపారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…