జై భీమ్ వల్ల సూర్యకు ఎంత లాభం వచ్చిందో తెలుసా..?

2020 సంవత్సరంలో ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, ఈ సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటూ.. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది. దీనిలో నటించిన ప్రతీ ఒక్క నటీనటులకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. రియల్ అడ్వకేట్ అయిన చంద్రు క్యారెక్టర్ ను సూర్య పోషించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా చంద్రు బాధ్యతలు నిర్వహించారు. మానవ హక్కులకు సంబంధించిన 96,000 కేసులను చంద్రు పరిష్కరించారు.

అయితే ఈ సినిమాలో అమాయకులైన ఓ కుటుంబాన్ని అక్రమంగా పోలీసులు ఓ కేసులో ఇరికించి చిత్ర హింసలు పెడతారు. ఇదే ఈ సినిమాకు మెయిన్ పాయింట్.ఇక పోతే ఇటీవల రియల్ సినతల్లికి డ్యాన్స్ మాస్టార్ ఇల్లు కట్టిచ్చి ఇస్తాన్నన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వల్ల సూర్యకు ఎంత లాభం వచ్చిందో తెలుసా.. దానిపై సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాను 10 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి చిత్రీకరించగా అమెజాన్లో రూ.45 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అంతే సూర్యాకు దాదాపు రూ.35 కోట్లు లాభం వచ్చినట్లు. అంతే కాకుండా ఈ సినిమా గూగుల్ యూజర్లకు తెగ నచ్చేసింది. 97 శాతం మంది గూగుల్ యూజర్లు ఈ చిత్రం చాలా బాగుంది అంటూ కొనియాడారు. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా.. ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేసింది.