Flash Back : ఐటెం సాంగ్స్ చేసే నటీమణులను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే.!

Flash Back : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ మంచి గుర్తింపు రావడం కోసం చాలా రకాల పాత్రలను చేసి మంచి గుర్తింపును సాధించుకుంటారు ప్రస్తుతం చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కోరుకుంటూ ఎవరూ చేయని భిన్నమైన కథలను ఉంచుకొని చేయాలి అనే ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతూ మంచి కథలు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు అయితే అలాంటి పరిస్థితిలో ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ,వెంకటేష్ లాంటి అగ్ర హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చేవారు. అప్పుడప్పుడు వారు కొన్ని వైవిధ్యమైన చిత్రాలను చేసి మంచి హీరోలు అనిపించుకున్నప్పటికీ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు.

కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో లెక్కలు మారిపోయాయి. చూసే ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది అని చెప్పాలి. కొత్త సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తున్న చాలామంది దర్శకులు ప్రేక్షకుల అభిరుచిని కనిపెట్టి సక్సెస్ ఫుల్ సినిమాలుగా మార్చుకుంటున్నారు. అలా చాలా మంది దర్శకులు హీరోలుగా మంచి సక్సెస్ లు కొట్టి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఒకప్పుడు సినిమాల్లో ఐటంసాంగ్స్ చేయడానికి ఐటం బామలు సపరేట్ గా ఉండేవారు. వారు ప్రతి సినిమాలో ఐటెం సాంగ్స్ చేస్తూ జనాలని ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ సినిమా సక్సెస్ సాధించడంలో వాళ్ళ వంతు పాత్ర పోషిస్తూ ఉండేవారు.

ఒకప్పుడు జయమాలిని లాంటి వారు వ్యాంపు క్యారెక్టర్ లో చేస్తూ మంచి గుర్తింపు పొందారు. వాళ్ల తరువాత సిల్క్ స్మిత కూడా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్స్ చేస్తున్న టైంలోనే డిస్కోశాంతి కూడా ఐటెం సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు సాధించుకుంది. అయితే ప్రస్తుతం సినిమాల్లో ఐటెం సాంగ్ లు హీరోయిన్స్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఐటెం సాంగ్స్ చేస్తూ హీరోయిన్ గానే కాకుండా ఐటం బామలుగా కూడా మంచి గుర్తింపు సాధించుకుంటు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి హీరోలుగా నటులుగా గుర్తింపు పొందిన వ్యక్తులు కొంత మంది ఐటెం భామలను పెళ్లి చేసుకున్నారు. వారు ఎవరో ఒకసారి మనం చూద్దాం..

శ్రీహరి – డిస్కో శాంతి

శ్రీహరి ఇండస్ట్రీకి వచ్చిన మొదట విలన్ గా వేషాలు వేస్తూ మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ తర్వాత హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రియల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుని ఇండస్ట్రీలో యాక్షన్ సన్నివేశాలు అన్ని రియల్ గా చేసి ప్రేక్షకుల్ని అలరించేవారు. అందులో భాగంగా భద్రాచలం లాంటి సినిమా లో ఆయన పోషించిన పాత్ర కి మంచి పేరు రావడంతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. అయితే అప్పుడు ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో శ్రీహరి మరణించిన విషయం మనందరికీ తెలిసిందే.

జెడి చక్రవర్తి – అనుకృతి శర్మ

హీరోగా తెలుగులో మంచి గుర్తింపు పొందారు జె.డి.చక్రవర్తి. శివ సినిమాతో విలన్ గా పరిచయం అయినప్పటికీ ఆ తర్వాత హీరోగా మంచి సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. బొంబాయి ప్రియుడు, ప్రేమకు వేళాయరా లాంటి సినిమాల్లో హీరోగా చేసి మంచి గుర్తింపు పొందారు. వాళ్ల గురువైన రాంగోపాల్ వర్మ తీసిన శ్రీదేవి సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ పోషించిన అనుక్రూత శర్మని పెళ్లి చేసుకున్నారు జేడీ చక్రవర్తి..