Samyuktha Menon: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విరూపాక్ష సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 21వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలకు చేరువయ్యింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండి హిట్ టాక్ తో దూసుకుపోతూ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. దీంతో చిత్ర బృందం ఫుల్ ఖుషీ లో ఉంది.
ఇదిలా ఉండగా విరూపాక్ష బ్యూటీ సంయుక్త మీనన్ తాజాగా దర్శకుడు కార్తీక్ దండుకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విరూపాక్ష సినిమా విడుదలైన తర్వాత సినిమా రెస్పాన్స్ గురించి తెలుసుకోవటానికి సినిమా యూనిట్ తో పాటు దర్శకుడు కార్తీక్ కూడా ప్రేక్షకులతో కలిసి థియేటర్ కి వెళ్ళగా అక్కడ అతని ఫోన్ ఎవరో దొంగలించినట్టు కార్తీక్ ఇటీవల తెలియజేశాడు.
ఇలా దర్శకుడు ఫోన్ పోగొట్టుకుపోవడంతో తనకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నటువంటి సంయుక్త అతనికి ఐఫోన్ ప్రో మోడల్ సెల్ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు స్వయంగా వెల్లడించింది. సినిమా హిట్ అయిన సందర్భంగా దర్శకుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్న సందర్భంలో కార్తీక్ ఫోన్ దొంగలించబడింది. దీంతో సంయుక్త వెంటనే అతనికి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసినట్లు తెలిపింది.
కార్తీక్ ఫోన్ పోవడంతో సినిమా గురించి సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయో తెలుసుకోవటానికి యూనిట్ లో ఉన్న వారి మొబైల్ లో చూసేవాడని సంయుక్త తెలిపింది. ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత నటించిన ఈ సినిమా మంచి హిట్టు అందుకోవడంతో సాయి ధరమ్ తేజ్ ఫుల్ హ్యాపీగా సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…