Samyuktha Menon: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విరూపాక్ష సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 21వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలకు చేరువయ్యింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండి హిట్ టాక్ తో దూసుకుపోతూ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. దీంతో చిత్ర బృందం ఫుల్ ఖుషీ లో ఉంది.
ఇదిలా ఉండగా విరూపాక్ష బ్యూటీ సంయుక్త మీనన్ తాజాగా దర్శకుడు కార్తీక్ దండుకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విరూపాక్ష సినిమా విడుదలైన తర్వాత సినిమా రెస్పాన్స్ గురించి తెలుసుకోవటానికి సినిమా యూనిట్ తో పాటు దర్శకుడు కార్తీక్ కూడా ప్రేక్షకులతో కలిసి థియేటర్ కి వెళ్ళగా అక్కడ అతని ఫోన్ ఎవరో దొంగలించినట్టు కార్తీక్ ఇటీవల తెలియజేశాడు.
ఇలా దర్శకుడు ఫోన్ పోగొట్టుకుపోవడంతో తనకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నటువంటి సంయుక్త అతనికి ఐఫోన్ ప్రో మోడల్ సెల్ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు స్వయంగా వెల్లడించింది. సినిమా హిట్ అయిన సందర్భంగా దర్శకుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్న సందర్భంలో కార్తీక్ ఫోన్ దొంగలించబడింది. దీంతో సంయుక్త వెంటనే అతనికి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసినట్లు తెలిపింది.
కార్తీక్ ఫోన్ పోవడంతో సినిమా గురించి సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయో తెలుసుకోవటానికి యూనిట్ లో ఉన్న వారి మొబైల్ లో చూసేవాడని సంయుక్త తెలిపింది. ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత నటించిన ఈ సినిమా మంచి హిట్టు అందుకోవడంతో సాయి ధరమ్ తేజ్ ఫుల్ హ్యాపీగా సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…