అదిరిపోయే ఆఫర్: బంగారం కొనేవారికి ఇప్పుడు ఏకంగా 55 శాతం తగ్గింపు!

బంగారం కొనాలని ఎవరికైతే ఉండదు చెప్పండి. బంగారం కొనాలి ఉన్న ధరలు ఆకాశాన్ని తాకడంతో ఆ ఆలోచనను విరమించుకుంటున్నారు. అయితే బంగారం కొనాలనే ఆలోచన చేసే వారికి ఇదొక మంచి అవకాశం. బంగారం కొనేవారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.కళ్యాణ్ జువెలర్స్‌కు చెందిన కాండెరే కస్టమర్లు పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ ద్వారా బంగారం, వజ్రాభరణాలు కొనేవారికి ఎంతో బెనిఫిట్ కలిగనుంది. ఈ ఆఫర్ ద్వారా పలు రకాల నగలపై భారీ తగ్గింపును అందిస్తోంది.

డైమండ్ ధరలపై కళ్యాణ్ జ్యువెలర్స్ అదనంగా 25 శాతం తగ్గిస్తుంది. ఈ క్రమంలోనే ఎంపిక చేసుకున్న వస్తువులపై అదనంగా 35 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు ఇక బంగారు నగల విషయానికి వస్తే ఆభరణాలు తయారీ చార్జీలలో ఏకంగా 50 శాంతం తగ్గింపునకు అందుబాటులో ఉంచింది. వెండి వస్తువులపై 55% తగ్గింపు ఇవ్వగా, ప్లాటినమ్ ఆభరణాలపై 30శాతం తగ్గింపు అందుబాటులో వచ్చింది.

బంగారు, డైమండ్ ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇకపోతే సోమవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం నాటికి బంగారు ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు తగ్గి రూ.48,650కు క్షీణించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయలు తగ్గి రూ.44,590 లకు చేరుకుంది.ఈ విధంగా పతనమైన బంగారం రేట్లతో కళ్యాణ్ జ్యువెలర్స్ అందిస్తున్న అద్భుతమైన ఆఫర్ ద్వారా ఎంతో విలువైన బంగారం మీ సొంతం చేసుకోవచ్చు.