GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త... లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

GOOGLE PAY: ప్రస్తుతం లావాదేవీలన్నీ ఆన్ లైన్ అవతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేసే దేశాాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. అతి తక్కువ కాలంంలోనే ఇండియాలోని ప్రజలు డిజిటల్ లావాదేవీలకు అలవాటుపడ్డారు. 

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త... లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్
GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

కేంద్ర ప్రభుత్వం యూపీఐ తీసుకువచ్చిన తర్వాత.. భీమ్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి యాప్స్ నేరుగా క్యాష్ లెస్ లావాదేవీలకు ఊతమిచ్చాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ ఉందంటే.. వాటిలో ఈ యాప్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. షాపుల్లో, రెస్టారెంట్లలో, హోటళ్లలో,  మార్కెట్లలో, చివరకు చిన్న స్థాయి వర్తకులు కూడా డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని కూడా ఇండియాలో ప్రవేశపెడుతామని… బడ్జెట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

ముఖ్యంగా కరోనా తరువాత ఇండియాలోె డిజిటల్ లావాదేవీల విలువ పెరిగింది. గతంతో పోలిస్తే ఆన్ లైన్ పేమెంట్లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది.

గుగూల్ పే ద్వారా రూ. లక్ష పర్సనల్ లోన్:

ఇదిలా ఉంటే.. గూగుల్ పే పే వాడుతున్నవారికి ఆన్ లైన్ పేమెంట్ యాప్ శుభవార్త చెప్పింది. గుగుల్ పే యాప్ ఉపయోగించే వినియోగదారులకు రూ. లక్ష వరకు రుణం పొందేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారు మాత్రమే అర్హులని తెలిపింది. గూగుల్ పే పే ప్రిక్వాలిఫైయర్ యూజర్లకు డీఎంఐ ఫినాన్స్ కంపెనీ.. పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ రుణాలు ఇవ్వనుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వ్యక్తి గత రుణాలు ఇవ్వనుంది. తీసుకున్న రుణాన్ని 36 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో ఈ సదుపాయాన్ని మరింత మందికి  అందుబాటులోకి తేనుంది.