Viral Video: అల్లం పేస్ట్ డబ్బాలో అట్లు పిండి స్టోర్ చేసి నవ్విస్తున్న ఓ ఎన్నారై మహిళ..!
Viral Video: సాధారణంగా మన ఇంట్లో తల్లిదండ్రులు వంట గదిలో చాలా రకాల పోపు డబ్బాలను అమర్చుకుంటారు. ఈ పోపు డబ్బాలో వంటలకు కావాల్సిన అనేక రకాల పదార్థాల స్టోర్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఉపయోగపడని ఎటువంటి డబ్బాను అయినా పోపు డబ్బా రూపంలో ఉపయోగపడేలా చేసుకుంటారు.
ఇదే క్రమంలో ఒక ఎన్నారై మహిళ నెటిజన్లను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. ఆమె పేరు అర్షియా మూర్జానీ ఈమె అమెరికాలో ఉంటూ బిజినెస్ రంగాన్ని కొనసాగిస్తుంది. ఇక ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్ డోరు తెరిచి గోదావరి అల్లం పేస్టు డబ్బాను బయటికి తీసింది. ఇక అందరూ దాంట్లో అల్లం పేస్ట్ ఉంటుందని అనుకున్నారు.
కానీ దాంట్లో దోసెల పిండి స్టోర్ చేసుకుంది. ఆ పిండిని పెనం పై వేసుకొని ఒక దోస తయారు చేసుకొని తినేసింది. అంతేకాకుండా మా కుటుంబం ప్రతీదాన్ని రీసైక్లింగ్ చేస్తుంది. అల్లం పేస్టు డబ్బాలో ఉన్నది దోశ పిండి కొన్ని రోజుల క్రితం నా చెల్లి ఫ్రిజ్లో పెట్టి ఉంచింది. నేను కూడా మొదట అల్లం పేస్ట్ ఏమో అని కన్ఫ్యూజ్ అయ్యాను.
తర్వాత నాకు అర్థమైంది. మా ఫ్యామిలీ ఇలా ప్రతి ఒకటీ దేనికో దానికి ఉపయోగపడేలా చేయడం నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుందని మూర్జానీ తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇక మీరూ ఓ లుక్కేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…