Viral Video: అల్లం పేస్ట్ డబ్బాలో అట్లు పిండి స్టోర్ చేసి నవ్విస్తున్న ఓ ఎన్నారై మహిళ..!
Viral Video: సాధారణంగా మన ఇంట్లో తల్లిదండ్రులు వంట గదిలో చాలా రకాల పోపు డబ్బాలను అమర్చుకుంటారు. ఈ పోపు డబ్బాలో వంటలకు కావాల్సిన అనేక రకాల పదార్థాల స్టోర్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఉపయోగపడని ఎటువంటి డబ్బాను అయినా పోపు డబ్బా రూపంలో ఉపయోగపడేలా చేసుకుంటారు.
ఇదే క్రమంలో ఒక ఎన్నారై మహిళ నెటిజన్లను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. ఆమె పేరు అర్షియా మూర్జానీ ఈమె అమెరికాలో ఉంటూ బిజినెస్ రంగాన్ని కొనసాగిస్తుంది. ఇక ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్ డోరు తెరిచి గోదావరి అల్లం పేస్టు డబ్బాను బయటికి తీసింది. ఇక అందరూ దాంట్లో అల్లం పేస్ట్ ఉంటుందని అనుకున్నారు.
కానీ దాంట్లో దోసెల పిండి స్టోర్ చేసుకుంది. ఆ పిండిని పెనం పై వేసుకొని ఒక దోస తయారు చేసుకొని తినేసింది. అంతేకాకుండా మా కుటుంబం ప్రతీదాన్ని రీసైక్లింగ్ చేస్తుంది. అల్లం పేస్టు డబ్బాలో ఉన్నది దోశ పిండి కొన్ని రోజుల క్రితం నా చెల్లి ఫ్రిజ్లో పెట్టి ఉంచింది. నేను కూడా మొదట అల్లం పేస్ట్ ఏమో అని కన్ఫ్యూజ్ అయ్యాను.
తర్వాత నాకు అర్థమైంది. మా ఫ్యామిలీ ఇలా ప్రతి ఒకటీ దేనికో దానికి ఉపయోగపడేలా చేయడం నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుందని మూర్జానీ తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇక మీరూ ఓ లుక్కేయండి.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…