మద్యం తాగి.. నడిరోడ్డుపై తన్నుకున్న మహిళలు..

‘మందు బాబులం.. మేము మందుబాబులం మందు కొడితే.. మాకు మేమే మహారాజులం’ అని సినిమాలో పాట లాగానే ఇక్కడ మందు కొట్టి నానా హంగామా చేశారు మహిళలు. హహారాజులం కాకుండా హహారాణులం అన్నట్లు వ్యవహరించారు. మందు తాగి రొడ్డుపైకి వచ్చి ఒకరినొకరు తిట్టుకొని.. కొట్టుకొని పిచ్చి పిచ్చిగా వ్యవహరించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. మందు నోట్లోకి వెళ్తే ఎవరైనా సరే ఎదుటి వాళ్లకు చుక్కులు చూపిస్తుంటారు.

సాధారణంగా పురుషులు ఇలా మందేసి చిందులు వేసిన ఘటనలు ఉన్నాయి కానీ.. మహిళలు మద్యం తాగడం ఈ మధ్య కామనే అయినా.. పెద్దగా వివాదాలు, గొడవలు జరగవు. సాఫ్ట్ వేర్, కొన్ని కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే యువతులు, పేజ్-3 వర్గానికి చెందిన వారు తాగడం చూస్తుంటాం.

కానీ మందేసిన మహిళలు రోడ్డుపై గొడవపడటం, తన్నుకోవడం చాలా అరుదైన దృశ్యమనే చెప్పాలి. అలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి సోమసుందరపాలెం సమీపంలో జరిగింది. ఇద్దరు మహిళలు మద్యం సేవించి ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. వీరిద్దరు మంచి స్నేహితులు. అందులో ఒకరిది మూల్పూరు గ్రామం.. మరొకరిది తెనాలికి చెందినవారు.

ఇద్దరు సరదాకా మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా.. మాటా మాటా పెరిగి గొడవ పెద్దది అయింది. ఇందులో మూల్పూరుకు చెందిన మహిళ బలంగా కొట్టడంతో తెనాలికి చెందిన మహిళ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు 108 కి కాల్ చేశారు. గాయపడిని మహిళలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.