Manchu Lakshmi: పెళ్లి మధ్యలో పారిపోవాలనుకున్నా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్..

Manchu Lakshmi: ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య దూరం చాలా తగ్గిపోయింది.ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు వారి చిన్నప్పటి ఫోటోలను లేదా వారి తీపి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి కూడా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Manchu Lakshmi: పెళ్లి మధ్యలో పారిపోవాలనుకున్నా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్..
Manchu Lakshmi: పెళ్లి మధ్యలో పారిపోవాలనుకున్నా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్..

ఈ సందర్భంగా లక్ష్మీ మంచు తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ..పెళ్లి కూతురిని మండపంలోకి తీసుకు రమ్మని చెప్పినప్పుడు తనకు చాలా భయం, కంగారు వేసిందని ఆ సమయంలో మండపం నుంచి పారిపోవాలని దారి కూడా వెతుక్కుంటున్నాను అంటూ ఈమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని ఈమె చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Manchu Lakshmi: పెళ్లిరోజు పారిపోవాలని దారి కూడా వెతుక్కున్నా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్.. ఫోటోలు వైరల్!

మంచు లక్ష్మి 2006 వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దంపతులు సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. మంచు లక్ష్మి తన కూతురుకి సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

Manchu Lakshmi: మోహన్ బాబుతో ఫోటో వైరల్:

లక్ష్మీ మంచు తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే ఎన్నో టీవీ షోలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మీప్రసన్న అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి,ఊకొడతారా ఉలిక్కి పడతారా వంటి చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఈమె మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.