Jabardasth: వేదికపై తండ్రిని తలుచుకుని ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకున్న ప్రవీణ్… ఓదార్చిన జడ్జ్ ఇంద్రజ!

Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న వారిలో ప్రవీణ్ ఒకరు. పటాస్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ టీమ్ లో సందడి చేస్తున్నారు.

 

ఇకపోతే ప్రతివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం నుంచి ముందుగా ప్రోమో విడుదల చేస్తుంటారు ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా కంటెస్టెంట్లు ఎప్పటిలాగే పెర్ఫార్మెన్స్ చేసి అందరిని సందడి చేశారు. అయితే రాకింగ్ రాకేష్ స్కిట్ ద్వారా అందరిని సందడి చేసిన ప్రవీణ్ చివరిలో అందరిని ఏడిపించారు.

ఈ సందర్భంగా వేదికపై ప్రవీణ్ తన తల్లిదండ్రులను తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకున్నారు. దేవుడు మా అమ్మను తీసుకెళ్లాక నాకు నా తండ్రిని ఒక్కడినే ఇచ్చాడు.ఇక నాకు ఏ బాధ వచ్చిన నేను తన తండ్రితోనే చెప్పుకునే వాడిని ప్రతిరోజు సాయంత్రం ఏరా తిన్నావా? ఎలా ఉన్నావ్ అంటూ ప్రశ్నించేవారు. ఇలా నా యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత నాన్న పడుకునేవారు ఇప్పుడు నాన్నని కూడా దూరం చేసావంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.

 

Jabardasth: వేదికపై అందరిని ఏడిపించిన ప్రవీణ్..

ఈ విధంగా పటాస్ ప్రవీణ్ తన తల్లి తండ్రిని తలుచుకొని ఎమోషనల్ కాగా ఈయన బాధ విన్న ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే జడ్జ్ ఇంద్రజ తనని హక్కును చేర్చుకొని ఓదార్చే తనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.