Pawan Kalyan: ఆ దేవుడి ఆశీస్సుల వల్లే పిఠాపురంలో పవన్ వారి మెజారిటీ సాధించారా?

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన పిఠాపురం నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక కూటమిలో భాగంగా విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ఇలా పవన్ కళ్యాణ్ ఇటు సినీ రంగంలో హీరోగా సక్సెస్ అయ్యారు అలాగే రాజకీయంలో కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొని అవమానాలని సోపానాలుగా చేసుకొని ఎంతో ఎత్తుకు ఎదిగారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా రాజకీయాలలో విజయం సాధించడానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

మెగా కుటుంబానికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయనే సంగతి తెలిసిందే. మెగా కుటుంబ సభ్యులు ఎప్పుడు ఏ శుభకార్యం తలపెట్టిన అంజన్న ఆశీస్సులను తీసుకుంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం కొండగట్టు అంజన్న ఆశీర్వాదాలు తీసుకొని ప్రతి ఒక్క పని మొదలు పెట్టారని తెలుస్తోంది.

కొండగట్టు అంజన్న..
ఈయన ప్రచార కార్యక్రమాలను కూడా కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీర్వాదాలతోనే ప్రారంభించారు అలాగే ఆయన ప్రచార వాహనం వారాహికి కూడా అక్కడే పూజలు చేయించారు. ఇలా 2024 ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కూడా ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకునే ప్రారంభించడం వల్ల ఆయనకు ప్రతి చోట విజయం అందుకున్నారని చెప్పాలి. కొండగట్టు అంజన్న ఆశీస్సులు తనపై ఎల్లవేళలా ఉంటాయని పవన్ కూడా పలు సందర్భాలలో వెల్లడించారు.