తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన జెస్సీ.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు వైరల్..!

తెలుగులో ప్రసారం అయిన బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ పూర్తయింది. 105 రోజుల ఈ జర్నీ ఎట్టకేలకు నిన్న గ్రాండ్ గా ముగిసింది. అయితే హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లు అడుపెట్టగా.. మొదటి వీక్ లో సరయు ఎలిమినేట్ అయింది.

తర్వాత 8వ వారంలో హౌస్ లో పెద్ద టర్న్ తిరిగిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ వారంలో మొత్తం 5గురు నామినేషన్లో ఉండగా.. అబదులో చివరకు మానస్, కాజల్ నిలిచారు. ఆ వారం అప్పటికే జెస్సీ వర్టిగో సమస్యతో బాధపడుతూ ఇబ్బందులు పడుతుండగా.. అతడిని సీక్రెట్ రూంలో ఉంచారు నిర్వాహకులు.

అందులో అతడికి వైద్యులు ట్రీట్ మెంట్ ఇస్తూ వచ్చారు. కానీ అప్పటికీ అతడి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. దీంతో మానస్, కాజల్ సేఫ్ అయ్యారు. ఇక జెస్సీ హౌస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా షణ్ముఖ్, సిరికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు.

ఇక ఫైనల్ అతడు నాగార్జునతో మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నాడు. విజయవాడ వెళ్లిన దగ్గర నుంచి ఎక్కువగా తనతో సెల్ఫీలు దిగుతున్నారని చెపపాడు. అంతే కాకుండా అతడికి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నట్లు చెప్పాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేస్తున్నట్లు చెప్పాడు.

బిగ్ బాస్ వల్ల తన లైఫ్ టర్న్ అయిందని చెప్పడు. ఇక తాజాగా ఈ విషయాన్ని స్వయంగా జెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. తన ఫస్ట్‌ మూవీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు.సందీప్‌ మైత్రేయ దర్శకత్వంలో ఓ డెబ్యూ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు.