కమల్ హాసన్ హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే..?

కరోనా కేసులు దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా థర్డ్ వేవ్ తప్పదనే అంచనాలకు వస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే.. మునుపటి పరిణామాల కంటే ఎక్కువగా ఉంటే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే. ఇటీవల తమిళ స్టార్ కమల్ హాసన్ కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం శ్రీ రామచంద్ర మెడికల్​ సెంటర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడు త్వరగా కోలుకోవాని తమిళనాడులోని కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు యావత్ దేశమంతా ప్రార్థిస్తుంది. అయితే అక్కడి వైద్యలు తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ ను విడదలు చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. తన తండ్రి కమల్​ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నటి శ్రుతిహాసన్​.

త్వరలోనే అందరి ముందుకు వస్తారని.. ఆయన కూడా అదే ఆకాక్షింస్తున్నారని పేర్కొన్నారు. అయితే అతడికి కరోనా పాజిటివ్ గా నవంబర్ 22 న వచ్చినట్లు అతడే స్వయంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి అతడు ఇండియాకు వచ్చి.. వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. ఆ రోజు నుంచి అతడు సెల్ఫ్ క్వారంటైన్ అయ్యి.. వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇక ఇప్పటికే పలువురు సినీ పెద్దలు కమల్ హాసన్ కు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగానే రజనీకాంత్ కూడా ఉన్నారు. ఇలా క‌మ‌ల్‌ను ప‌రామ‌ర్శించిన వారిలో కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన శివకార్తికేయన్ , , విష్ణు విశాల్, ప్రభు, శరత్ కుమార్ తో పాటు ప‌లువురు ఉన్నారు.