ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్న కపట సూత్రధారి..!

క్రాంతి సైనా దర్శకత్వంలో విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందూలాల్, మాస్టర్ బాబా అహిల్, అమీక్షా, సునీత తదితరులు ప్రధాన పాత్రలలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం “కపట సూత్రధారి”. రామ్ తవ్వ సంగీతం వహించగా, సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి మనీష్ (హలీమ్) నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12వ తేదీ విడుదల కానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శివారెడ్డి మాట్లాడుతూ ఇన్ని రోజులు ఇంత అద్భుతమైన టైటిల్ ఉన్న సినిమాను ఎందుకు తెరకెక్కించలేదని ఆశ్చర్యం వేస్తుంది అని తెలిపారు.ఈ సినిమాను తెరకెక్కించడంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడారు.

ఇక నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూదర్శకుడు క్రాంతి తను మంచి స్నేహితులు అని ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలకు పని చేశామని తెలిపారు. ఈ క్రమంలోనే చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.ఇక హీరో హీరోయిన్స్ మాట్లాడుతూ ఈ సినిమాలో అవకాశం కల్పించినందుకు దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

నిర్మాత మనీష్ మాట్లాడుతూ కథ వినగానే ఎంతో నచ్చింది ఎలాగైనా ఈ సినిమాను తెరకెక్కించాలని భావించాము.ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని సినిమా చాలా బాగా వచ్చిందని తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుందని ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడారు. ఈ క్రమంలోనే సినిమా నవంబర్ 12వ తేదీ విడుదల కానున్నట్లు తెలియజేశారు.