Sreekanth Reddy: డబ్బు కోసం కరాటే కళ్యాణి బ్లాక్ మెయిల్ చేసింది: శ్రీకాంత్ రెడ్డి

Sreekanth Reddy: గురువారం సాయంత్రం నటి కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ పై దాడి చేసిన సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో ఈ దాడి వెనక గల కారణం ఏంటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి దాడిలో గాయపడిన శ్రీకాంత్ రెడ్డి తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయం గురించి స్పందించారు.

Sreekanth Reddy: డబ్బు కోసం కరాటే కళ్యాణి బ్లాక్ మెయిల్ చేసింది: శ్రీకాంత్ రెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గురువారం సాయంత్రం 9 గంటల సమయంలో కరాటే కళ్యాణి తనతో పాటు ముగ్గురు అబ్బాయిలు తీసుకొని మా ఇంటికి వచ్చారు. బయటనుంచి గట్టి గట్టిగా అరుస్తూ ఉండడంతో బయటకి వెళ్ళాను.బయటకు వెళ్ళగానే నువ్వు సమాజంలో ఆడవాళ్ళ పట్ల ఎంతో అసభ్యకరమైన ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నావ్ అంటూ నన్ను తిట్టారు. ఆమె అలా అనడంతో మీరు కూడా సినిమాల్లో చేస్తున్నారు కదా అంత కన్నా దారుణమైనవి కాదు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే చేస్తున్నానని చెప్పినట్లు శ్రీకాంత్ వెల్లడించారు.

Sreekanth Reddy: డబ్బు కోసం కరాటే కళ్యాణి బ్లాక్ మెయిల్ చేసింది: శ్రీకాంత్ రెడ్డి

నా ఫ్రాంక్ వీడియోలు ద్వారా ఏ మహిళ ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు వాళ్ళకు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నాను అంటూ శ్రీకాంత్ ఈ సందర్భంగా తెలియజేశారు. అమ్మాయిలు కూడా వారికంటూ గుర్తింపు రావాలని ఇలాంటి ఫ్రాంక్ వీడియోలలో చేస్తున్నారని శ్రీకాంత్ వెల్లడించారు.

డబ్బులు తీసుకొని ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నారు…

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను మహిళా సంఘాలకు ఫిర్యాదు చేస్తాను నీ పై చర్యలు తీసుకుంటాను అంటూ నన్ను బెదిరించారు. అలా జరగకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని సూచించారు. ఇలా డబ్బులు నేనెందుకు ఇస్తానని తనతో గొడవకు దిగగా తన పక్కన ఉన్న ఒక వ్యక్తి నన్ను పక్కకు తీసుకెళ్లి భుజంపై చేయి వేసి 70 వేలకు సెట్ చేస్తాను అనవసరంగా గొడవ ఎందుకు అంటూ మాట్లాడారు. అయితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని ఒకవేళ మహిళలు అభ్యంతరకరంగా ఫీల్ అయితే వాళ్లు నా పై కంప్లైంట్ చేస్తారు అంటూ తనకు ఎదురు తిరగడంతో వాళ్ళు తనపై దాడి చేశారని ఈ సందర్భంగా శ్రీకాంత్ ఈ వీడియో ద్వారా తన పై జరిగిన దాడి గురించి తెలిపారు.