తనకు నంది అవార్డు ఇవ్వలేదంటూ జగన్ ను విమర్శిస్తూ.. బాబు పై పొగడ్తలు చేసిన నటి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంది అవార్డులు సందడి కనిపించి చాలా కాలమైంది. ఈ విధంగా ఇండస్ట్రీలో వారి నటనను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటిస్తుంది. అయితే ఈ నంది అవార్డుల విషయంలో ప్రభుత్వం టాలెంట్ కి తగ్గట్టుగా కాకుండా, రెకమెండేషన్, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి పేర్లను నంది అవార్డుల జాబితాలో విడుదల చేస్తారనే విమర్శలు వినిపిస్తుంటాయి. అదేవిధంగా నంది అవార్డులను ఎరగా వేసి సినీ సెలబ్రిటీలను రాజకీయాల వైపు తిప్పుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తుంటాయి.

తాజాగా తనకి రావాల్సిన నంది అవార్డు ఇప్పటివరకు రాలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సినీనటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కరాటే కళ్యాణి గోరంత దీపం సీరియల్ లో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిందని, తన నటనకు అప్పటి ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించిందని, అయితే ఇప్పటి వరకు నంది అవార్డ్ తనకు దక్కలేదని ఆ సీరియల్ గెటప్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలను చేసింది.

ఈ ఫోటోలను చూస్తుంటే 2013 సంవత్సరానికి వెళ్ళిపోయాను అప్పుడు ఎంతో సన్నగా అయ్యాను. ఈ సీరియల్ ద్వారా మంచి పేరుతో పాటు నంది అవార్డు కూడా కూడా వచ్చింది. అయితే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుగారు ఉన్నారు ఆయన దిగిపోయే సమయానికి నంది అవార్డును అనౌన్స్ చేసినప్పటికీ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు తనకు నంది అవార్డు ఇవ్వడం లేదంటూ జగన్ పై విమర్శల వర్షం కురిపించింది.

గోరంత దీపం సీరియల్ కోసం తాను ప్రత్యేకంగా తెలంగాణ భాషను నేర్చుకున్నట్లు తెలిపింది.తాను విలన్ గా ఎంతో అద్భుతంగా నటించిన ఈ పాత్రకు జగన్మోహన్ రెడ్డి నంది అవార్డు ఇవ్వకపోవడంతో అందరిని ఎంతో బాధకు గురి చేశాయని ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.ఈమె చేసిన పోస్టర్ పై స్పందించిన నెటిజన్లు 2013లో నంది అవార్డు చేస్తే 2017,2019 వరకు చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్నారు. ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎందుకొచ్చాడు బాబీ అంటూ… నువ్వు నీ పెయిడ్ పోస్టులు అంటూ నెటిజన్లు కరాటే కళ్యాణి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అయితే కరాటే కళ్యాణి సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు ఈ విధంగా పలుమార్లు ఆమె జగన్మోహన్ రెడ్డి గురించి స్పందించారు.